Kanaka Durga Temple: కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా.. ఇకపై వీరికి నో ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanaka Durga Temple: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇంద్రకీలాద్రి ముందు వరుసలో ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తజనం తరలి వస్తుంటారు. ఈ మధ్యకాలంలో కొందరు ఆలయానికి వచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆలయంలో ఉన్నప్పుడూ ఎలా ఉండాలి, ఎలా రావాలి అనేది పూర్తిగా మరిచి నడుచుకుంటున్నారని తోటి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు తెలిసి తెలియక ఆలయంలో సెల్ఫీలు దిగడం అమ్మవారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం లాంటి పనులు చేస్తున్నారు. ఒక పక్క డ్రెస్ కోడ్ పాటించక పోవడం, మరోపక్క అమ్మవారి మూలవిరాట్ సోషల్ మీడియాలో వైరల్ చేయడం లాంటి పనులు చేస్తున్నారు. ఇక్కడ భక్తులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.. సెల్ ఫోన్స్ ఉన్న వ్యక్తులు ఆలయంలో దొంగచాటుగా అమ్మవారి స్వరూపం చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టకూడదని నిబంధన ఉంది.
READ ALSO: ప్రధాన అంశాలపై చర్చించేందుకు BRS నేతలతో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఇకపై కచ్చితంగా పాటించాల్సిందే..
పలువురు ఆలయ అధికారులు మాట్లాడుతూ.. ఆలయంలో కచ్చితంగా ఇదే డ్రెస్కోడ్ పాటించాలని ఏమీ లేదు. కానీ అభ్యంతరమైన దుస్తులు ధరించి రావొద్దని.. సాంప్రదాయమైన దుస్తువులు ధరించాలని రావాలి. ఇది ఆలయ ప్రతిష్టకు సంబంధించిందని, కాబట్టి వివిఐపీలు, వీఐపీలు సహా ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఈ రూల్ వర్తిస్తుందన్నారు. ఆలయంలో పనిచేసే సిబ్బందికి సైతం అంతరాలయంలోకి ఫోన్లు తీసుకురాకూడదని స్పష్టం చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాలు వస్తున్న నేపథ్యంలో కచ్చితంగా ఈ నిబంధనలు అమలు చేసేలా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నిబంధనలకు సంబంధించిన సైన్ బోర్డ్ సైతం ఇంద్రకీలాద్రిపై అన్ని వైపులా ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి తరహాలో ఇంద్రకీలాద్రిలో సైతం కీలకమైన మార్పులు జరగాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు. ఈ నిబంధనలు పాటిస్తే ఇంద్రకీలాద్రికి మరింత ప్రాముఖ్యత పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. కాబట్టి సంప్రదాయ పరిరక్షణ, ఆలయ ప్రతిష్ట, ఆలయ భద్రత కోసం ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాలని చెబుతున్నారు.
READ ALSO: PM Modi Funny Moment: దేనికి చప్పట్లు కొడుతున్నారంటూ.. నవ్వులు పూయించిన ప్రధాని..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?