Site icon NTV Telugu

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్‌ మారాయ్..

Vande Bharat

Vande Bharat

హిందూపూర్ స్టేషన్‌లో కాచిగూడ–యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పులు చేస్తూ నైరుతి రైల్వే (South Western Railway) నిర్ణయం తీసుకుంది. రైలు కార్యకలాపాలను మరింత మెరుగుపరచడానికి, సమయపాలన పాటించడానికి ఈ కొత్త సమయాలు మార్చి 15 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

యశ్వంతపూర్ – కాచిగూడ వందే భారత్ (ట్రైన్ నంబర్ 20704): ఇది హిందూపూర్‌కు మధ్యాహ్నం 3.55 గంటలకు చేరుకుని, 3.57 గంటలకు బయలుదేరుతుంది. (గతంలో ఇది 3.48 గంటలకు వచ్చి, 3.50 గంటలకు బయలుదేరేది).

కాచిగూడ – యశ్వంతపూర్ వందే భారత్ (ట్రైన్ నంబర్ 20703): ఇది హిందూపూర్‌కు మధ్యాహ్నం 12.17 గంటలకు చేరుకుని, 12.19 గంటలకు బయలుదేరుతుంది. (గతంలో ఇది 12.08 గంటలకు వచ్చి, 12.10 గంటలకు బయలుదేరేది).

Also Read:AI Effect: ఏఐతో ఉద్యోగాలు కోల్పోయే 10 రంగాలు ఇవే.. జాబితా వెల్లడించిన ఆంత్రోపిక్..

ప్రయాణికులు ఈ కొత్త సమయాలను గమనించి.. తమ ప్రయాణాలను దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. రైలు ప్రయాణంలో జాప్యాన్ని తగ్గించి, సేవలను మరింత వేగవంతం చేయడానికి ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇలా ఉండగా.. యశ్వంత్ పూర్ టు కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో 6 రోజులు రాకపోకలు సాగిస్తుంది. బుధవారం ఒక్క రోజు ఈ రైలు సర్వీస్ ఉండదు. ఇక ఈ ట్రైన్ కాచిగూడ నుంచి బయలు దేరి మహబూబ్‌నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.

Exit mobile version