Jupally Krishna Rao : స్పెయిన్ ప‌ర్యాట‌న‌కు ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

Jupally

Jupally

FITUR పేరుతో ప్రఖ్యాతిగాంచిన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో జరిగే అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్లో పాల్గొనేందుకు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ బృందం మాడ్రిడ్ చేరుకుంది. ఈ అంతర్జాతీయ పర్యాటక, వాణిజ్య ప్రదర్శన జనవరి 24 నుంచి జనవరి 28 వరకు మాడ్రిడ్ లోని IFEMAలో జరగనుంది.

అంతర్జాతీయ పర్యాటక నిపుణుల వేదిక మాత్రమే కాదు ఈ FITUR ప్రఖ్యాత వాణిజ్య ప్రదర్శన కూడా. ప్రకృతి, పర్యావరణం, సాహసాలు, చారిత్రిక. ఆధ్యాత్మిక రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో టూరిజానికి ఉన్న అవకాశాలను తెలంగాణ బృందం ఈ ప్రదర్శనలో ప్రదర్శించనుంది. పర్యాటక రంగంలో చోటుచేసుకుంటున్న తాజా ధోరణులను తెలంగాణ బృందం ఈ పర్యటనలో అధ్యయనం చేయనుంది.

పర్యాటక విభాగాన్ని ఆదాయ వ‌న‌రుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నమంత్రి జూపల్లి కృష్ణారావు ఈ పర్యటనలో పర్యాటక రంగంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణలో ఉన్న అవకాశాలను వివ‌రించ‌నున్నారు.

ఫలితంగా తెలంగాణలో టూరిజం విభాగంను ఆదాయ ఆర్జన విభాగంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వివ‌రించారు. ఈ ప‌ర్య‌ట‌న ద్వారా తెలంగాణ ప‌ర్యాట‌క రంగానికి మ‌రింత ఊతం ల‌భించ‌నుంద‌ని, త‌ద్వారా ప్రపంచ పర్యాటకులు తెలంగాణ ను సందర్శించే అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయ‌ని అన్నారు.