NTV Telugu Site icon

Jogu Ramanna : కాంగ్రెస్ బీజేపి ఒక్కటే.. మోడీని చూస్తే రేవంత్ కి భయం

Jogu Ramanna

Jogu Ramanna

రేవంత్ రెడ్డి రెండు నాలుకల సిద్దాంతం బయట పడిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఇవాళ ఆయన ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ది రెండు కళ్ళ సిద్దాంతం.. ఆయన లోపల బీజేపీ, బయట కాంగ్రెస్ అని ఆయన అన్నారు. అప్పుడు బడే భాయ్ అన్నావు ఇప్పుడు మోడీ ని తిట్టారని, కాంగ్రెస్ బీజేపి ఒక్కటే. మోడి ని చూస్తే రేవంత్ కి భయమని, నీకే అభద్రతా భావం తో ఉన్నావని జోగు రామన్న ఫైర్‌ అయ్యారు. మీ ప్రభుత్వాన్ని మీ వాళ్ళే కూల్చు తారని, రైతు బంధు ను రైతు భరోసా అన్నావు.. ఎందుకు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కారణం ఏంటి.. కళ్యాణ లక్ష్మీ తులం బంగారం ఏమైందని ఆయన ప్రశ్నించారు.

 

ఆనాడు ఆరు గ్యారంటీ లు అమలు చేస్తాం అన్నారు.. మరి ఇప్పుడు ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపొతే నష్ట పోతారు అని ఓటర్లను భయపెట్టారన్నారు. ఎన్నికల ఉల్లంఘన కాదా. దాని పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవినీతి కి చిరునామా రేవంత్ రెడ్డి అని, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మీద జనం కు నమ్మకం సన్న గిల్లుతుంది అది నిన్నటి సభ తో రేవంత్ రెడ్డి కి తెలిసి పోయిందన్నారు. ఆదివాసీలు అంటే రేవంత్ కు అలుసా అని ఆయన మండిపడ్డారు. ఆదివాసి అభ్యర్థిని, ఆదివాసీలను అవమాన పరిచిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు.