Site icon NTV Telugu

Jithender Reddy : ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్ రెడ్డి

Jithender Reddy

Jithender Reddy

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపారు. నన్ను నమ్మి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం కల్పించారు, కేబినెట్ ర్యాంక్ ఇచ్చారన్నారు. ఎన్నో పోరాటాలు చేసి, రాష్ట్రాన్ని సాధించుకున్నామని, విభజన చట్టంలో పెట్టిన అంశా పై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు జితేందర్‌ రెడ్డి. కృష్ణా నుంచి రావలసిన నీటి వాటా కూడా రాలేదని, సాగునీరు, త్రాగు నీరు సాధించడం కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ విషయంలో కూడా కేంద్రం చాలా అంశాలను పెండింగ్ లో పెట్టిందని జితేందర్‌ రెడ్డి అన్నారు. కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖల పై ఒత్తిడి తెస్తాం.. ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు. తెలంగాణ ను స్పోర్ట్స్ హబ్ గా తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేస్తామని, ఏపీ నుంచి భవన్ విషయంలో ఎటువంటి అనుమతి అవసరం లేదన్నారు. ఢిల్లి లో తెలంగాణ భవన్ నిర్మాణం కోసం కసరత్తు మొదలైందని, త్వరలోనే ఢిల్లీలో తెలంగాణా కు కొత్త భవనం నిర్మాణం జరుగుతోందన్నారు.

Exit mobile version