Jagadish Reddy: HCU తరలింపు అనాలోచిత నిర్ణయం.. మాజీ మంత్రి హాట్ కామెంట్స్

  • HCU తరలింపు అనాలోచిత నిర్ణయం.
  • HCUని తరలించడం అనేది ప్రభుత్వానికి సరికొత్త సమస్యలను తెచ్చిపెట్టే నిర్ణయం.
  • విద్యార్థి సంఘాలు, పర్యావరణ వేత్తలను జాతీయ స్థాయిలో చర్చలకు ఆహ్వానించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా?
  • బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
Jagadish Reddy

Jagadish Reddy

Jagadish Reddy: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) తరలింపు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయాన్ని ఆయన అనాలోచితమైనది అని వ్యాఖ్యానించారు. HCUని తరలించడం అనేది ప్రభుత్వానికి సరికొత్త సమస్యలను తెచ్చిపెట్టే నిర్ణయమని ఆయన తెలిపారు. HCUని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా చేస్తే మంచిది అని చెప్పారు. గతంలో HCUని తరలించాలని అనుకున్న ముఖ్యమంత్రి లు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ నిర్ణయాన్ని తీసుకునే ముందు మరింత ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

HCU తరలింపును వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ పై చేసిన ఆరోపణలపై స్పందించారు. AI ద్వారా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఆరోపించడం సరికాదు అని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఆలోచనలు లేకుండా ఆక్షేపణలు చేయడం సరైనది కాదని ఆయన సూచించారు. జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. ప్రభుత్వం కోర్టులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే కొందరు అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని, ఈ పరిస్థితి సరిపోలేలా లేదు అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కొందరు అధికారి తప్పుదారి పట్టిస్తున్నారు, దీని మీద ప్రభుత్వం గమనించాలని ఆయన సూచించారు.

చివరగా HCU భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు, పర్యావరణ వేత్తలను జాతీయ స్థాయిలో చర్చలకు ఆహ్వానించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం విద్యార్థుల, పర్యావరణవేత్తలతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.