NTV Telugu Site icon

IRR Scam Case: నేడు చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Chandrababu

Chandrababu

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ ( ఐఆర్‌ఆర్‌) భూకుంభ కోణం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ కేసులో విచారణను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించబోతుంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో చంద్రబాబు నాయుడుకి ఈనెల(జనవరి) 10వ తేదీన ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Read Also: Pune: “క్యారెక్టర్‌పై అనుమానం”.. మహిళా టెక్కీని చంపేసిన బాయ్‌ఫ్రెండ్..

ఇక, ఇన్నర్‌ రింగ్‌ భూ కుంభకోణం, ఉచిత ఇసుక, మద్యం విధానాల్లో అక్ర­మాలపై ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసుల్లో మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు­కు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితులు­గా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సై­జ్‌ శాఖ అప్పటి కమిషనర్‌ శ్రీనరేష్ లకు కూడా ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు సైతం విధించింది. కాగా, ఈ బెయిల్‌ను రద్దు చేయాలని సవాల్‌ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ అప్పిల్ చేసింది. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపనుంది.