Aakash Chopra: “కోట్లు పెట్టి కొంటే హ్యాండ్ ఇస్తారా?”.. ఐపీఎల్లో విదేశీ ప్లేయర్స్ తీరుపై ఆకాష్ చోప్రా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aakash Chopra: ఐపీఎల్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. అప్పటికే అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ఇక ఓ అంశం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన బౌలర్లు ఒక్కొక్కరిగా ఐపీఎల్కు దూరమవుతున్నారు. దీంతో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు ఆందోళనకు గురవుతున్నాయి. సన్రైజర్స్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇప్పటికే దూరమయ్యాడు. ఇషాన్ కిషన్ను తమ కెప్టెన్గా టీమ్ నియమించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన జోష్ హేజిల్వుడ్ గాయం కారణంగా టోర్నమెంట్ ప్రారంభానికి దూరమవ్వనున్నాడు. ఇప్పుడు, ఢిల్లీ క్యాపిటల్స్కు చెందిన మిచెల్ స్టార్క్ సైతం ఐపీఎల్ 2026 ప్రారంభానికి అందుబాటులో ఉండడు. ఇలా వరుసగా స్టార్ ప్లేయర్స్ దూరమవుతుండంపై తాజాగా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఫైర్ అయ్యారు. మిచెల్ స్టార్క్ సీజన్ ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదని తెలిసిందన్నారు. ఇప్పటికే జోష్ హాజిల్వుడ్, పాట్ కమిన్స్లు దూరమయ్యారని.. తాజాగా స్టార్క్ గాయంతో బాధపడుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొందన్నారు. కానీ నిజానికి అతను ఫిట్గా ఉన్నప్పటికీ సీఏ మాత్రం ఏవో సాకులు చెప్పి అతన్ని ఐపీఎల్ మ్యాచ్లు ఆడకుండా చూస్తుందని ఆరోపించారు. స్టార్క్ టీ20 క్రికెట్కు ఎప్పుడో వీడ్కోలు పలికాడని గుర్తు చేశారు. మరి రెండు నెలలుగా స్టార్క్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చేసినట్లు? అని నిలదీశారు.
READ MORE: Danam Nagender : దానం నాగేందర్ ‘క్లీన్ చిట్’పై హైకోర్టులో సవాల్
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
“ఆస్ట్రేలియా క్రికెట్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. మరోవైపు న్యూజిలాండ్ బౌలర్ లోకీ ఫెర్గూసన్ సైతం దూరమయ్యాడు. ఫెర్గూసన్ కుటుంబంతో గడిపపేందుకు తొలి ఏడు మ్యాచులకు రాకపోవడం దారుణం.. ప్రెసెంట్ అతను సౌతాఫ్రికాతో 20 సిరీస్లు అడుతున్నాడు. ఇది అయిపోగానే వెంటనే కుటుంబంతో గడిపేందుకు వెళ్తాడట. అది అతడి వ్యక్తిగతం కానీ.. అతన్ని రూ. 2 కోట్లకు కొనుగోలు చేశారు. ఏడు మ్యాచుల తర్వాత వచ్చి రూ.కోటి తీసుకుని వెళ్లిపోతాడు. ఐపీఎల్లో మాట ఇచ్చి ఏడు మ్యాచ్లకు దూరమైతే, టీమ్లు ఏం చేయాలి? ఇది సరైన నిర్ణయం కాదు.. జట్టు తీవ్రంగా నష్టపోతుంది.” అని ఆకాష్ చోప్రా వెల్లడించారు. ఇదిలా ఉండగా.. సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్లో పాట్ కమిన్స్ లేని లోటు స్పష్టంగా కనిపించనుంది. ఢిల్లీ క్యాపిటల్స్లో మిచెల్ స్టార్క్ లేని లోటును పూడ్చేందుకు లుంగీ ఎన్గిడి లేదా కైల్ జేమీసన్ వంటి బౌలర్లపై ఆధారపడాల్సి వస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ లో నాథన్ ఎల్లిస్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమవ్వడం సీఎస్కేకు పెద్ద దెబ్బగా మారనుంది. లక్నో సూపర్ జెయింట్స్ లో వానిందు హసరంగ సైతం గాయంతో బాధపడుతుండటంతో ఆ జట్టు స్పిన్ విభాగంపై ఆందోళన నెలకొంది. విదేశీ ఆటగాళ్ల ఈ తరహా నిర్ణయాల వల్ల ఐపీఎల్ ఫ్రాంచైజీలు భవిష్యత్తులో ఆటగాళ్లను ఎంచుకునేటప్పుడు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!