IPL 2025: ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ ఆ టీమ్స్ మధ్యనే.. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఎప్పుడంటే?
- ఐపీఎల్ 18వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభం
- కోల్కతాలో ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్
- మే 25న ఫైనల్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ వేదిక గురించి బీసీసీఐ ఇప్పటికే సమాచారం ఇచ్చినా.. తలపడే టీమ్స్ గురించి మాత్రం చెప్పలేదు. తాజా క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య లీగ్ మొదటి మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సొంత నగరమైన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మొదటి మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుంది.
గతేడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మార్చి 23న రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మధ్యాహ్నం 3.30కి ఆరంభం కానుంది. ఐపీఎల్ 2025 మ్యాచ్ల తేదీలను బీసీసీఐ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ముఖ్యమైన మ్యాచ్ల తేదీల గురించి ఆయా జట్లకు బీసీసీఐ అనధికారికంగా తెలియజేసినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం మే 25న ఈడెన్ గార్డెన్స్ మైదానం ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వనుంది.
Also Read
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
ముంబైలో జనవరి 12న ప్రత్యేక సర్వసభ్య సమావేశం అనంతరం మార్చి 23న ఐపీఎల్ 2025 ప్రారంభమవుతుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా సూచప్రాయంగా చెప్పారు. అయితే బ్రాడ్కాస్టర్ల అభ్యర్థన మేరకు బీసీసీఐ తేదీలను సవరించినట్లు తేలింది. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కోల్కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, లక్నో, ముల్లన్పూర్, ఢిల్లీ, జైపూర్లతో పాటు ఈ సీజన్ మ్యాచ్లు గౌహతి మరియు ధర్మశాలలో కూడా జరుగుతాయి. గత సంవత్సరం మాదిరిగానే ధర్మశాల రెండు గేమ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ హైదరాబాద్లో.. క్వాలిఫైయర్ 2, ఫైనల్ కోల్కతాలో జరిగే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!