Indonesia President : భారత్ చేరుకున్న ఇండోనేషియా అధ్యక్షుడు.. పలు రంగాల్లో ఇరు దేశాలకు కుదిరిన ఒప్పందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indonesia President : భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుబియాంటో శనివారం భారతదేశానికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి, ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈరోజు (శనివారం) ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశం అయ్యారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో నాల్గవ వ్యక్తి. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని మోడీ ఇండోనేషియా అధ్యక్షుడికి స్వాగతం పలికారు. భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా ముఖ్య అతిథి దేశంగా ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు మరోసారి భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ఇండోనేషియా మరోసారి ఈ చారిత్రాత్మక క్షణంలో భాగం కావడం గర్వకారణం. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను భారతదేశానికి స్వాగతిస్తున్నాను అన్నారు.
సైబర్ భద్రత, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తాను : మోదీ
‘‘2018లో నేను ఇండోనేషియా పర్యటన సందర్భంగా, మా భాగస్వామ్యాన్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ముందుకు తీసుకెళ్లాం’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఈరోజు అధ్యక్షుడు ప్రబోవోతో పరస్పర సహకారం పై విస్తృత చర్చ జరిగింది. రక్షణ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి, తయారీ, సరఫరాలో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. సముద్ర భద్రత, సైబర్ భద్రత, ఉగ్రవాద నిరోధం, తీవ్రవాద నిర్మూలన రంగాలలో సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి.
Also Read
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
- Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
Read Also:Nuvve Kavali: మూడు దేశాల్లో 50 లక్షల ఖర్చుతో మెహబూబ్, శ్రీ సత్యల ఆల్బమ్ సాంగ్
భద్రత రంగంలో ఈరోజు సంతకం చేసిన ఒప్పందం నేరాల నివారణ, శోధన, రక్షణచ, సామర్థ్య నిర్మాణంలో భారత్ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా వృద్ధి చెందింది. గత సంవత్సరం ఇది 30 బిలియన్ డాలర్లను దాటింది.
అధ్యక్షుడు ప్రబోవో ఏమి చెప్పారు?
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మాట్లాడుతూ.. “భారతదేశానికి నా మొదటి అధికారిక పర్యటన సందర్భంగా నాకు లభించిన గౌరవానికి కృతజ్ఞతను తెలుపుతున్నాను. ఈరోజు అధ్యక్షుడు నన్ను ఎంతో గౌరవంగా స్వాగతించారు. ప్రధానమంత్రి మోడీ, ఆయన ప్రభుత్వం, నేను, నా ప్రభుత్వం మధ్య చాలా విస్తృత చర్చ జరిగింది.’’ అన్నారు.
Read Also:PM Modi : నెలలోపే ప్రధాని మోదీ రెండో సారి ఒడిశా పర్యటన.. కారణం ఇదే
తాజావార్తలు
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?