Nitin Gadkari : త్వరలో దేశ రహదారులు అమెరికా వాటిలా మారుతాయన్న నితిన్ గడ్కరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari : త్వరలో ఇండియా రోడ్లు అమెరికాలా మారనున్నాయి. దేశంలోని రోడ్లు, హైవేలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం రోజురోజుకు కృషి చేస్తోంది. అదే సమయంలో భారత్ రోడ్లు అమెరికా తరహాలో మారే రోజు ఎంతో దూరంలో లేదు. ఇది మేం చెప్పేది కాదు స్వయంగా రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవడంలో రోడ్లదే కీలక పాత్ర అని గడ్కరీ ఓ కార్యక్రమంలో అన్నారు. భారతదేశ రహదారులు ఎప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ అవతాయో ఆయన చెప్పారు.
Read Also:Purandeswari: అమిత్ షా పొత్తు కామెంట్.. పురంధేశ్వరి ఏమన్నారంటే..
Also Read
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
- Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
రోడ్లు అమెరికా లాగా ఎప్పుడు మారుతాయి?
ఈ ఏడాది చివరి నాటికి భారత్ రోడ్ నెట్వర్క్ అమెరికా మాదిరిగానే అబ్బురపడనుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 36 ఎక్స్ప్రెస్ హైవేలను నిర్మిస్తోంది, ఇది వివిధ నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఢిల్లీ నుంచి చెన్నైని కలిపే హైవే ప్రాజెక్టు నిర్మాణంతో రెండు నగరాల మధ్య దూరం 320 కి.మీ మేర తగ్గుతుందని చెప్పారు. అస్సాంలోని నుమాలిగఢ్లో వెదురుతో ఇథనాల్ను తయారు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇంధనంలో మార్పు మరియు మంచి రోడ్ల అభివృద్ధి కారణంగా దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు సింగిల్ డిజిట్కు తగ్గుతుంది.
Read Also:Chiyaan Vikram: ఆ సినిమాకి సీక్వెల్ చేస్తే థియేటర్స్ తగలబడిపోతాయ్…
మౌలిక సదుపాయాల అవసరం
మనకు మూలధన పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి కావాలంటే మనకు మంచి మౌలిక సదుపాయాలు అవసరమని ఒక విషయం స్పష్టంగా అర్థమైందని గడ్కరీ అన్నారు. నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ లేకుండా మనం వ్యవసాయం, సేవలు, పరిశ్రమలను అభివృద్ధి చేయలేము. మౌలిక సదుపాయాలు లేకుండా పర్యాటకాన్ని అభివృద్ధి చేయలేము. 2014లో మోడీ ప్రధాని అయ్యాక దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గడ్కరీ అన్నారు. గొప్ప దేశాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం అన్ని విధాలా కృషి చేస్తున్నామని, ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో వెదురుతో ఇథనాల్ను తయారుచేస్తున్నామని చెప్పారు.
తాజావార్తలు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?