PoK Protests: పీఓకేలో నిరసనలు.. మునీర్ సైన్యం దురాగతాలపై స్పందించిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Slams Pakistan Army: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో నిరసనలు కొనసాగుతున్నాయి. స్వాతంత్ర్యం కోరుతూ నిరసనకారులపై పాకిస్థాన్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఫలితంగా డజన్ల కొద్దీ జనాలు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. PoK లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ముజఫరాబాద్కు లాంగ్ మార్చ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నిరసన కారులు ముజఫరాబాద్కు చేరుకోకుండా నిరోధించడానికి పాకిస్థాన్ ప్రభుత్వం నిశ్చయించుకుంది. అయితే.. తాజాగా ఈ అంశంపై భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ నిరసనలు అణచివేత, దోపిడీ ఫలితమని స్పష్టం చేశారు.
Read More: Chittoor Gang-Rape: చిత్తూరు గ్యాంగ్ రేప్ నిందితుల ఊరేగింపు.. కోర్టు వరకు నడిపిస్తూ..
Also Read
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో హింస, నిరసనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. “పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని అనేక ప్రాంతాలలో నిరసనలు జరిగినట్లు మేము చూశాం. పాకిస్థాన్ సైన్యం అమాయక పౌరులపై క్రూరత్వం ప్రదర్శించింది. ఇది పాకిస్థాన్ అణచివేత విధానం. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి వనరులను క్రమబద్ధంగా దోచుకోవడం వల్లే ఈ నిరసన జరిగిందని మేము విశ్వసిస్తున్నాం. పాకిస్థాన్ ఈ భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు జవాబుదారీగా ఉండాలి.” అని పేర్కొన్నారు.
Read More: Ponnam Prabhakar : రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు మంత్రి పొన్నం లేఖ
ఇదిలా ఉండగా.. PoKలోని ప్రజలు చాలా రోజులుగా షాబాజ్ ప్రభుత్వానికి, అసిమ్ మునీర్ సైన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. అవామీ యాక్షన్ కమిటీ (AAC) నేతృత్వంలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ముజఫరాబాద్, మీర్పూర్, కోట్లి, రావలకోట్, నీలం లోయతో సహా అనేక జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనల కారణంగా, పీఓకేలోని అనేక ప్రాంతాల్లో దుకాణాలు మూసేశారు. రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. అక్కడి జన జీవనం పూర్తిగా స్తంభించింది.
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!