NTV Telugu Site icon

PM Modi in Mann ki Baat: అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతాలు చేస్తోంది..

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Modi in Mann ki Baat: సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం సాధించిన ప్రగతి గురించి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తన నెలవారీ రేడియో ప్రసారమైన మన్ కీ బాత్‌లో భారతదేశం సౌర, అంతరిక్ష రంగంలో అద్భుతాలు చేస్తోందని అన్నారు. తన మన్ కీ బాత్ 94వ ఎపిసోడ్‌లో, ప్రధాన మంత్రి మాట్లాడుతూ, “మన దేశం సౌర, అంతరిక్ష రంగంలో అద్భుతాలు చేస్తోంది. దీపావళికి ఒక రోజు ముందు భారతదేశం ఏకకాలంలో 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఈ ప్రయోగంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కోహిమా వరకు, మొత్తం దేశంలో డిజిటల్ కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుంది. ఉపగ్రహ ప్రయోగం సహాయంతో మారుమూల ప్రాంతాలు దేశంలోని ఇతర ప్రాంతాలతో మరింత సులభంగా అనుసంధానించబడతాయి.” అని ప్రధాని అన్నారు.

భారతదేశానికి క్రయోజెనిక్ రాకెట్ టెక్నాలజీని నిరాకరించిన ఆ పాత రోజులు కూడా తనకు గుర్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. కానీ భారతదేశ శాస్త్రవేత్తలు స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడమే కాకుండా నేడు దాని సహాయంతో డజన్ల కొద్దీ ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగంతో, గ్లోబల్ కమర్షియల్ మార్కెట్‌లో భారత్ బలమైన భాగస్వామిగా అవతరించింది.. దీంతో భారత్‌కు కొత్త అవకాశాల తలుపులు కూడా తెరుచుకున్నాయి.

World’s Longest Train : 100బోగీలు, నాలుగు ఇంజన్లు.. 1.9కిలోమీటర్లతో ప్రపంచంలోనే పొడవైన రైలు

భారతదేశంలో అంతకుముందు అంతరిక్ష రంగం ప్రభుత్వ వ్యవస్థల పరిధిలోనే పరిమితమై ఉండేదని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశ యువత కోసం అంతరిక్ష రంగం తెరవబడినప్పటి నుంచి విప్లవాత్మక మార్పులు రావడం ప్రారంభించాయి. భారతీయ పరిశ్రమలు, స్టార్టప్‌లు ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు, కొత్త సాంకేతికతలను తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష సంస్థల సహకారం ఈ రంగంలో పెద్ద మార్పును తీసుకురాబోతోందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచం మొత్తం సౌరశక్తిని భవిష్యత్తుగా చూస్తోందని ప్రధాని మోడీ అన్నారు.