భారతదేశ విమానయాన రంగం , అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2027 మార్చి 25న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సుమారు రూ. 30,640 కోట్ల భారీ ప్యాకేజీతో మూడు ముఖ్యమైన పథకాలకు ఆమోదముద్ర వేశారు. దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే ఈ నిర్ణయాల్లో విమానయాన విస్తరణ, విదేశీయుల రాకపోకల పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలు ప్రధానంగా ఉన్నాయి.
ముఖ్యంగా సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేసే ‘ఉడాన్’ (UDAN) పథకంలో భారీ మార్పులు చేస్తూ.. దానిని పదేళ్ల పాటు పొడిగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ. 28,480 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో దేశవ్యాప్తంగా దాదాపు 100 విమానాశ్రయాలను ఆధునీకరించనున్నారు. ఫలితంగా టైర్-2, టైర్-3 నగరాల మధ్య విమాన రాకపోకలు మెరుగుపడటమే కాకుండా.. ప్రాంతీయ అనుసంధానత పెరిగి ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి.
Also Read:TGPSC: శుభవార్త చెప్పిన టీజీపీఎస్సీ(TGPSC).. ఏప్రిల్ 10 చివరి తేదీ..
మరోవైపు.. దేశంలోకి వచ్చే విదేశీయుల రాకపోకలను పర్యవేక్షించే ‘IVFRT’ (Immigration, Visa, Foreigners Registration Tracking) ప్రాజెక్టును మరో ఐదేళ్ల పాటు కొనసాగించనున్నారు. 2026 ఏప్రిల్ 1 నుంmr 2031 వరకు అమల్లో ఉండే ఈ పథకం కోసం రూ. 1800 కోట్లు కేటాయించారు. దీనివల్ల వీసా ప్రక్రియ వేగవంతం అవ్వడమే కాకుండా.. భద్రతా పరంగా విదేశీయుల ట్రాకింగ్ మరింత పటిష్టంగా మారుతుంది.
వీటితో పాటు.. పర్యావరణ పరిరక్షణపై భారత్ తన నిబద్ధతను చాటుకుంది. నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ (NDC) కింద 2025 నుంచి 2035 వరకు చేరుకోవాల్సిన పర్యావరణ లక్ష్యాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. కాలుష్య నివారణ, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ అడుగులు వేయనుంది. ఈ మూడు నిర్ణయాలు దేశాన్ని ఆధునిక , సుస్థిర అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
