India vs England Semi-Final History: అంతర్జాతీయ క్రికెట్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య పోటీ ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల నాకౌట్ మ్యాచ్లలో ఈ రెండు జట్లు తలపడితే.. అభిమానులకు అసలైన థ్రిల్ కలుగుతుంది. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్, ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ చేరాయి. ముంబై వేదికగా మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో రెండు టీమ్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ చరిత్ర చూస్తే.. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరు ఉత్కంఠంగా సాగింది.
టీ20 వరల్డ్ కప్ 2022 సెమీఫైనల్లో భారత్-ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం చూపింది. భారత్ను ఓడించి ఫైనల్కు చేరిన ఇంగ్లాండ్.. టైటిల్ను కూడా సొంతం చేసుకుంది. ఆ ఓటమి భారత అభిమానులకు నిరాశ కలిగించినప్పటికీ జట్టుకు పెద్ద పాఠంగా మారింది. టీ20 వరల్డ్ కప్ 2024 సెమీఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్పై విజయం సాధించి గత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఆ మ్యాచ్లో భారత సమిష్టిగా ఆడి ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఈ విజయంతో ఇండియా-ఇంగ్లాండ్ సెమీఫైనల్ రికార్డు 1-1గా సమమైంది.
Also Read: IND vs AFG Schedule 2026: భారత్-అఫ్గానిస్థాన్ షెడ్యూల్ విడుదల.. మ్యాచ్లు ఎప్పుడు, ఎక్కడంటే?
ఇప్పుడు అభిమానుల దృష్టి అంతా భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ 2026పైనే ఉంది. గతంలో ఒక్కోసారి ఒక్కో జట్టు పైచేయి సాధించడంతో.. ఈసారి ఎవరు గెలుస్తారన్న ఆసక్తి మరింత పెరిగింది. చరిత్ర చూస్తే.. ఇరు జట్లు సమానంగా పోటీ పడుతున్నాయి. కాబట్టి 2026 సెమీఫైనల్ మ్యాచ్ అసలైన మజాను ఇవ్వడం ఖాయం. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ముంబై చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. వాంఖడే మైదానం చిన్నది కాబట్టి పరుగుల వరద పారే అవకాశం ఉంది.
