Budget 2025 : బడ్జెట్ తో అరవింద్ కేజ్రీవాల్ కు గట్టి షాక్ ఇచ్చిన ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget 2025 : ఢిల్లీ ఎన్నికల రంగంలో ఆదాయపు పన్ను మినహాయింపుకు సంబంధించి పొలిటికల్ గేమ్ నడుస్తోంది. జనవరి 22న అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం రూ.12 లక్షల వరకు రాయితీ ప్రకటించింది. 2025 బడ్జెట్ను ప్రకటిస్తూ నిర్మలా సీతారామన్ రూ.7 లక్షల మినహాయింపును ఇప్పుడు రూ.12 లక్షలకు పెంచుతున్నట్లు చెప్పారు. నిర్మల కొత్త ప్రకటన కారణంగా వార్షిక ఆదాయం రూ. 12 లక్షల 75 వేలు ఉన్న వ్యక్తి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రామాణిక మినహాయింపు కారణంగా రూ. 75,000 ప్రయోజనం లభిస్తుంది.
Read Also:AP Finance Department: కేంద్ర బడ్జెట్పై ఏపీ ఆర్ధికశాఖ అలెర్ట్..
Also Read
అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పారు?
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 8 రోజుల క్రితం ఒక వీడియోను షేర్ చేశారు. మధ్యతరగతి ప్రజలు పన్ను ఉగ్రవాదానికి బలి అయ్యారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేంద్రంలో ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వాలు వచ్చాయి. కానీ మధ్యతరగతి వారికి ఎవరూ ఏమీ చేయలేకపోయాయన్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం రూ. 10 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను అని కేజ్రీవాల్ అన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపును రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడం అవసరం. కేంద్రం మధ్యతరగతిని ఏటీఎంగా పరిగణించకూడదని, లేకుంటే నష్టాలు తప్పవని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
Read Also:Gig Workers: ఆన్ లైన్ డెలివరీ వర్కర్స్ కి కేంద్రం గుడ్ న్యూస్.. ఇక మీ కష్టాలు తీరినట్టే!
12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు
బడ్జెట్లో మోడీ ప్రభుత్వం వార్షికంగా రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ప్రకటించింది. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రూ. 12 లక్షల ఆదాయం ఉన్నవారికి ప్రతి సంవత్సరం రూ. 80 వేల ప్రత్యక్ష ప్రయోజనం లభిస్తుంది. రూ.8 లక్షల నుండి రూ.9 లక్షల వరకు సంపాదించే పన్ను చెల్లింపుదారులకు రూ.30 వేల ప్రయోజనం లభిస్తుంది. సంవత్సరానికి 9-10 లక్షల రూపాయలు సంపాదించే వారికి రూ. 40 వేలు, సంవత్సరానికి 10-11 లక్షల రూపాయలు సంపాదించే వారికి రూ. 50 వేలు, సంవత్సరానికి 11-12 లక్షల రూపాయలు సంపాదించే వారికి రూ. 65 వేల ప్రయోజనం లభిస్తుంది. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు తర్వాత అమిత్ షా ఒక ప్రకటన విడుదల చేశారు. మోడీ హృదయంలో మధ్యతరగతి ఉందని షా అన్నారు. ప్రభుత్వ ఈ నిర్ణయం మధ్యతరగతికి ఆర్థిక సహాయం అందిస్తుంది. పీపుల్ రీసెర్చ్ ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో మధ్యతరగతి జనాభా దాదాపు 67 శాతం ఉంది, ఇది దేశంలోని ఏ రాష్ట్రంతో పోల్చినా అత్యధికం.
తాజావార్తలు
-
Posani Krishna Murali: ‘మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు’: పోసాని కృష్ణమురళి
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!