Andhra Pradesh: భర్తను హత్య చేసిన కేసులో భార్యతో సహా ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..

  • భర్తను హత్య చేసిన కేసులో భార్యతో సహా ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష
  • 2018 సంవత్సరంలో భర్తను హత్య చేసిన భార్య
  • గరుగుబిల్లి మండలం తోటపల్లి పార్కు సమీపంలో హత్య
  • పెళ్లయిన వారం రోజులకే ప్రియుడు మోజులో పడి భర్తను మర్డర్ చేయించిన భార్య
  • ఈ కేసు నేడు పార్వతీపురం జిల్లా కోర్టు తీర్పు వెల్లడి.
Parvathipuram Mayam

Parvathipuram Mayam

భర్తను హత్య చేసిన ఘటనలో పార్వతీపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యతో సహా హత్యకు సహకరించిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ క్రమంలో.. ఈ కేసుకు సంబంధించి తీర్పు ఈరోజు వెలువడింది.

Read Also: Poonam Kaur: అల్లు vs మెగా రచ్చ.. అల్లు అర్జున్ కి పూనమ్ మద్దతు

×
×
Ad

వివరాల్లోకి వెళ్తే.. 2018 సంవత్సరంలో భర్తను హత్య చేసిన ఘటనలో భార్యతో పాటుగా సహకరించిన నిందుతులకు పార్వతీపురం జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గరుగుబిల్లి మండలం తోటపల్లి పార్కు సమీపంలో ఈ హత్య అప్పుడు సంచలనం సృష్టించింది. అయితే.. పెళ్లయిన వారం రోజులకే ప్రియుడు మోజులో పడ్డ భార్య సరస్వతి.. భర్తను పథకం ప్రకారం హత్య చేయించింది. కాగా.. ఈ హత్య ఘటనపై పోలీసులు 24 గంటలలోనే ఛేదించారు. కాగా.. అప్పటి నుంచి కోర్టులో పెండింగ్లో ఉన్న కేసు.. ఈరోజు తీర్పు వచ్చింది. ఈ కేసులో.. మొత్తం ఆరుగురికి యావజ్జీవ కారాగర శిక్ష విధించింది పార్వతీపురం జిల్లా కోర్టు.

Read Also: Doctors safety: డాక్టర్ భద్రత కోసం రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..