Call Girls: భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు జరిగాయి. దీంతో భార్య వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత భర్త ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. భార్య దగ్గర లేకపోవడంతో శారీరక కోరిక తీర్చుకునేందుకు అమ్మాయిలను ఆశ్రయించాడు. గత మూడేళ్లుగా అతడి వద్దకు రెగ్యులర్ గా ఓ కాల్ గర్ల్ వస్తోంది. మొదట ఒంటరిగా వస్తున్న ఆమె తన స్నేహితురాలిని తీసుకెళ్లడం ప్రారంభించింది. అతని శరీరం ఆకలితో ఉంది.. ఆమెకేమో డబ్బు అవసరం. అతనికి సొంత వ్యాపారం ఉండేది. కాబట్టి ఆయనకు డబ్బుకు లోటు లేదు. ఆ కాల్ గర్ల్స్ అతనితో గడిపిన తర్వాత అన్నీ తెలుసుకున్నారు. అందుకే చాలా పద్దతిగా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. బాయ్ఫ్రెండ్స్ సహాయంతో కాలేజీ అమ్మాయిలు అతడిని అంతమొందించారు. కాల్ గర్ల్స్ చేసిన పనికి 42 ఏళ్ల దీపక్ కుర్హాడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే విచారణ ప్రారంభించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టయిన నిందితుల పేర్లు శివాని, భారతి, సందీప్ పాటిల్. పరారీలో ఉన్న నిందితుడి పేరు దేవరాయ్.
Read Also:Tomato: కాపురంలో చిచ్చు పెట్టిన టమోటా.. మొగుడిని వదిలేసిన భార్య..
వివరాల్లోకి వెళ్లితే.. తన భార్య నుండి విడిపోయిన మూడేళ్ల తర్వాత, కుహ్రాడే తన శారీరక అవసరాలను తీర్చడానికి ఇంటికి అమ్మాయిలను పిలిచేవాడు. అతను ఈ అమ్మాయిల కోసం చాలా డబ్బు ఖర్చు చేసేవాడు. దీంతో కుర్హాదే వద్ద చాలా డబ్బు ఉందని కాల్ గర్ల్స్ తెలుసుకున్నారు. కొన్ని రోజుల క్రితం శివానిపై కుర్హాడే ఏదో విషయంలో దుర్భాషలాడాడు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. ప్రేమికుల సాయంతో కుర్హాదేను హత్య చేసి అతని వద్ద ఉన్న డబ్బు దోచుకోవాలని ప్లాన్ చేసింది. దీని ప్రకారం 30 జూన్ 2023న శివాని, భారతి యధావిధిగా రాత్రి కుర్హాడే ఇంటికి వెళ్లారు. వెంటనే వారు మొదట గొడ్డలితో కుర్హాడేను కొట్టారు. ఆ తర్వాత విపరీతంగా మద్యం తాగారు. దీని తర్వాత ఆమె తన ప్రియుడు సందీప్ పాటిల్, దేవా రాయ్లకు ఫోన్ చేసింది. అనంతరం నలుగురు కలిసి మద్యం సీసాను కుర్హాడే తలపై పగలగొట్టి హత్య చేశారు. అనంతరం నలుగురూ తమకు కనపిచ్చిన డబ్బు తీసుకుని బయటి నుంచి డోర్ లాక్ చేసి బైక్పై పరారయ్యారు. మూడు రోజుల తర్వాత జూలై 2న అతని అత్త ఫోన్ చేసింది. కానీ అతను కాల్ ఎత్తడం లేదు. దీంతో ఆమె కుర్హాడే భార్యకు ఫోన్ చేసింది.
Read Also:Nani 30: నీ చూపులోనే మాయ ఉంది బాసూ… నిన్ను మించిన నేచురల్ నటుడు లేడు
దీంతో తన కుమార్తె ఇంటికి వచ్చింది. ఆమె తలుపు తెరిచి ఆశ్చర్యపోయింది. తండ్రి ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పాడ్ఘా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం గుర్తుతెలియని నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుర్హాదా మొబైల్ కాల్స్, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, సీసీటీవీ ఫుటేజీ వివరాలు ఆధారంగా శివానిని పోలీసులు గుర్తించారు. దీని తర్వాత శివానిని ఉల్హాస్నగర్లో అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో ఇద్దరు నిందితులు భారతి, సందీప్లను అరెస్టు చేశారు. నాల్గవ సహచరుడు దేవా పరారీలో ఉండగా, అతని కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి రూ.30 వేల నగదు, కత్తి, నేరానికి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
