అస్సాం గగనతలంలో భారత వాయుసేనకు చెందిన అత్యంత శక్తివంతమైన సుఖోయ్-30 ఎంకేఐ (Su-30 MKI) యుద్ధ విమానం ఆచూకీ గల్లంతయ్యింది. మార్చి 5, గురువారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో కార్బీ ఆంగ్లాండ్లోని చోకిహోలా ప్రాంతం వద్ద ఈ విమానానికి రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. సాధారణ శిక్షణలో భాగంగా గాలిలోకి ఎగిరిన ఈ యుద్ధ విమానం, సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలి ఉండవచ్చని రక్షణ వర్గాలు అనుమానిస్తున్నాయి.
Also Read:CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..
ఈ యుద్ధ విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు సమాచారం. రాడార్ నుంచి సిగ్నల్స్ నిలిచిపోవడంతో వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF), పైలట్ల ఆచూకీ కోసం భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ బృందాలను, హెలికాప్టర్లను రంగంలోకి దించి అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.
Also Read:AP Govt: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..
సుఖోయ్-30 ఎంకేఐ అనేది రష్యా టెక్నాలజీతో భారత్లో తయారైన ‘మల్టీ-రోల్ ఎయిర్క్రాఫ్ట్’. ఇది ఏకకాలంలో ఎయిర్ టు ఎయిర్ అండ్.. ఎయిర్ నుంచి సర్పేస్ (భూమి)పై ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఎయిర్ ఫోర్స్లో కీలకమైన ఈ విమానం అదృశ్యం కావడం భద్రతా పరమైన ఆందోళనలకు దారితీస్తోంది.
