Site icon NTV Telugu

Houthis: యూఎన్ సిబ్బందిని బంధించిన హౌతీలు.. బందీలు ఎందరంటే..

Houthis

Houthis

Houthis: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హౌతీల ప్రధానమంత్రితో సహా అనేక మంది సీనియర్ కమాండర్లు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు రాజధాని సనా, హుదేయిదా అనే ఓడరేవు పట్టణంపై దాడి చేశారు. ఆదివారం ఐక్యరాజ్యసమితి కార్యాలయాలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేసి 11 మంది ఐక్యరాజ్యసమితి ఉద్యోగులను బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడి తర్వాత ఐక్యరాజ్యసమితి కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయని యెమెన్ భద్రతా అధికారులు చెప్పారు.

READ ALSO: Kerala: ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు..

వారిని షరతులు లేకుండా విడుదల చేయాలి..
హౌతీ తిరుగుబాటుదారులు బందీలుగా చేసుకున్న వ్యక్తులు ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. హౌతీ తిరుగుబాటుదారులు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమం కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించి, సంస్థ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు, కార్యాలయాలను కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని అన్నారు. ఈ ఘటన చాలా దారుణమని యెమెన్‌కు ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి హన్స్ గ్రండ్బర్గ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి ఉద్యోగులను వెంటనే, ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రత్యేక రాయబారి హన్స్ గ్రండ్బర్గ్ మాట్లాడుతూ.. UN కార్యాలయంపై దాడి చేసి దాని ఉద్యోగులను బందీలుగా తీసుకోవడం సరైనది కాదని అన్నారు. హౌతీ తిరుగుబాటుదారుల చర్య యెమెన్ తీర్మానాన్ని ఉల్లంఘిస్తుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. నిజానికి యెమెన్లో పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి సహాయ కార్మికులు గూఢచర్యం చేసి ఇజ్రాయెల్, అమెరికాకు సమాచారం అందిస్తున్నారని హౌతీ తిరుగుబాటుదారులు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, హౌతీ తిరుగుబాటుదారులు తమ పరిధిని విస్తరించారు. డ్రోన్లు, క్షిపణుల ద్వారా అనేక వాణిజ్య ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. తాము పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నామని, దీని కోసం ఇజ్రాయెల్‌పై దాడి చేస్తూనే ఉంటామని హౌతీలు స్పష్టం చేశారు.

READ ALSO: Shocking School Fees: బాబోయ్ స్కూల్ ఫీజులు.. అక్షరాల లక్షలు

Exit mobile version