Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panama Canal: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చమురు, గ్యాస్ రవాణా అంతరాయం ఎదుర్కొంటోంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గం మూసివేత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రపంచ మొత్తం చమురు వినియోగంలో దాదాపు 20 శాతం వరకు హార్మూజ్ జలసంధి గుండా రవాణా అవుతుందని అంచనా. అయితే ప్రస్తుతం అక్కడ భద్రతా ఆందోళనలు, అమెరికా-ఇరాన్ ఘర్షణల కారణంగా అనేక నౌకాయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో పనామా కాలువకు ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగింది.
పనామా కాలువపై భారీ రద్దీ
హార్మూజ్ మార్గం అందుబాటులో లేకపోవడంతో చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు ఇప్పుడు పనామా కాలువ వైపు మళ్లుతున్నాయి. దీంతో అక్కడ రద్దీ తీవ్రంగా పెరిగింది. కాలువ గుండా వెళ్లేందుకు స్లాట్లు పొందడం కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. పరిస్థితి ఇంత వరకు వెళ్లిందంటే, అత్యవసర ప్రవేశాల కోసం వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ వేలంపాటల్లో ఒక్కో ట్యాంకర్కు దాదాపు 4 మిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.37 కోట్ల వరకు చెల్లించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఈ మార్గంలో ప్రయాణానికి 3 నుంచి 4 లక్షల డాలర్ల వరకు మాత్రమే ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు ప్రాధాన్య ప్రవేశానికి అదనపు భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
పనామా ప్రభుత్వానికి భారీ ఆదాయం
ఈ పరిస్థితి పనామా దేశానికి ఊహించని లాభాలను తెచ్చిపెడుతోంది. కాలువ వినియోగానికి డిమాండ్ పెరగడంతో పనామా ప్రభుత్వం టోల్ ఫీజులు, ప్రత్యేక ప్రవేశ రుసుముల రూపంలో భారీగా ఆదాయం పొందుతోంది. ప్రపంచ సరఫరా గొలుసుల్లో చోటుచేసుకున్న మార్పులు పనామా కాలువను మరోసారి అంతర్జాతీయ వాణిజ్య కేంద్రబిందువుగా మార్చాయి.
ప్రపంచ సరఫరా గొలుసులపై ప్రభావం
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, యుద్ధ పరిస్థితులు, క్షిపణి దాడులు, డ్రోన్ దాడుల భయాల మధ్య కంపెనీలు సురక్షిత మార్గాల కోసం అధిక ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే ఈ మార్పులు సరఫరా సమయాలను పెంచడమే కాకుండా, చమురు ధరలు, రవాణా వ్యయాలు, వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. హార్మూజ్ సంక్షోభం ఒక వైపు ప్రపంచానికి తలనొప్పిగా మారితే, మరో వైపు పనామా కాలువకు మాత్రం వరంలా మారిందనే చెప్పాలి.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!