Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panama Canal: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చమురు, గ్యాస్ రవాణా అంతరాయం ఎదుర్కొంటోంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గం మూసివేత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రపంచ మొత్తం చమురు వినియోగంలో దాదాపు 20 శాతం వరకు హార్మూజ్ జలసంధి గుండా రవాణా అవుతుందని అంచనా. అయితే ప్రస్తుతం అక్కడ భద్రతా ఆందోళనలు, అమెరికా-ఇరాన్ ఘర్షణల కారణంగా అనేక నౌకాయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో పనామా కాలువకు ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగింది.
పనామా కాలువపై భారీ రద్దీ
హార్మూజ్ మార్గం అందుబాటులో లేకపోవడంతో చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు ఇప్పుడు పనామా కాలువ వైపు మళ్లుతున్నాయి. దీంతో అక్కడ రద్దీ తీవ్రంగా పెరిగింది. కాలువ గుండా వెళ్లేందుకు స్లాట్లు పొందడం కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. పరిస్థితి ఇంత వరకు వెళ్లిందంటే, అత్యవసర ప్రవేశాల కోసం వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ వేలంపాటల్లో ఒక్కో ట్యాంకర్కు దాదాపు 4 మిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.37 కోట్ల వరకు చెల్లించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఈ మార్గంలో ప్రయాణానికి 3 నుంచి 4 లక్షల డాలర్ల వరకు మాత్రమే ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు ప్రాధాన్య ప్రవేశానికి అదనపు భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది.
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
పనామా ప్రభుత్వానికి భారీ ఆదాయం
ఈ పరిస్థితి పనామా దేశానికి ఊహించని లాభాలను తెచ్చిపెడుతోంది. కాలువ వినియోగానికి డిమాండ్ పెరగడంతో పనామా ప్రభుత్వం టోల్ ఫీజులు, ప్రత్యేక ప్రవేశ రుసుముల రూపంలో భారీగా ఆదాయం పొందుతోంది. ప్రపంచ సరఫరా గొలుసుల్లో చోటుచేసుకున్న మార్పులు పనామా కాలువను మరోసారి అంతర్జాతీయ వాణిజ్య కేంద్రబిందువుగా మార్చాయి.
ప్రపంచ సరఫరా గొలుసులపై ప్రభావం
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, యుద్ధ పరిస్థితులు, క్షిపణి దాడులు, డ్రోన్ దాడుల భయాల మధ్య కంపెనీలు సురక్షిత మార్గాల కోసం అధిక ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే ఈ మార్పులు సరఫరా సమయాలను పెంచడమే కాకుండా, చమురు ధరలు, రవాణా వ్యయాలు, వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. హార్మూజ్ సంక్షోభం ఒక వైపు ప్రపంచానికి తలనొప్పిగా మారితే, మరో వైపు పనామా కాలువకు మాత్రం వరంలా మారిందనే చెప్పాలి.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!