Himachal Pradesh : ఇద్దరు దుకాణదారుల మధ్య గొడవ.. మసీదు కూల్చివేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh : సిమ్లాలోని సంజౌలీలో మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా గురువారం హిందూ సంస్థలు నిరసన తెలిపాయి. మసీదులో జరుగుతున్న అక్రమ నిర్మాణం 2007 నుండి వివాదాస్పదంగా ఉంది. ప్రస్తుతం ఈ విషయం మున్సిపల్ కమిషనర్ కోర్టులో పెండింగ్లో ఉంది. దీనిపై సెప్టెంబర్ 7న ముఖ్యమైన విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 44 విచారణలు జరిగాయి. మసీదు వక్ఫ్ బోర్డ్ సొత్తు అని ముస్లిం పక్షం వాదించగా, ఈ మసీదు 1947కు ముందు నుంచి ఇక్కడ ఉందని, కోర్టులో జరుగుతున్న కేసును వక్ఫ్ బోర్డు చూసుకుంటుందని మసీదు ఇమామ్ మౌలానా షాజాద్ చెప్పారు.
వివాదం పెరిగి నిరసనలు ఎందుకు జరిగాయి?
మసీదు నిర్మాణానికి సంబంధించిన వివాదం పాతది, అయితే దానికి వ్యతిరేకంగా అకస్మాత్తుగా పెద్ద ప్రదర్శన జరగడానికి కారణం రెండు వేర్వేరు వర్గాలకు చెందిన దుకాణదారుల మధ్య గొడవ. సిమ్లాలోని మాన్యాలీలో సెలూన్ యజమానికి, ఎలక్ట్రికల్ ఉపకరణాల దుకాణదారునికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదం తోపులాటకు చేరుకోవడంతో తొలుత స్థానిక దుకాణాదారులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు.అయితే గొడవ ఇక్కడితో ఆగలేదు, ఇరువర్గాల దుకాణాదారులు తమ వారికి కూడబలుకుకొని వచ్చి మళ్లీ ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో విద్యుత్ పరికరాల దుకాణదారుడు మృతి చెందాడు. ఈ దాడి తరువాత, హిందూ సమాజానికి చెందిన ప్రజలు గుమిగూడి నిరసనకు సిద్ధమయ్యారు.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
మాన్యాల ఇష్యూ సంజౌళికి ఎలా చేరింది?
మాన్యాలాతో పోలిస్తే సిమ్లాలోని సంజౌలిలో ముస్లిం సమాజానికి చెందిన అత్యధిక సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు. ఇది కాకుండా, మసీదు నిర్మాణానికి సంబంధించిన వివాదం పెండింగ్లో ఉంది. దీనిపై సెప్టెంబర్ 7న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకే సంజౌలీని నిరసనలకు కేంద్రంగా మార్చారని స్థానికులు చెబుతున్నారు. రెండు వేర్వేరు వర్గాల ప్రజల మధ్య హింసాత్మక ఘర్షణ తర్వాత ఈ అంశం పెద్ద సమస్యగా మారింది మరియు ఇప్పుడు హిందూ సంస్థలు ప్రభుత్వానికి, పరిపాలనకు రెండు రోజుల అల్టిమేటం ఇచ్చాయి.
దీనిపై న్యాయస్థానం, యంత్రాంగం త్వరగా నిర్ణయం తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ చర్యలు తీసుకోవాలని, లేకుంటే సిమ్లా ప్రజలే తమ చేతుల్లోకి తీసుకుంటారని హిందూ సంస్థల ఈ అల్టిమేటం ఇచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మసీదు చుట్టూ భారీగా పోలీసులను మోహరించి భద్రతను పెంచారు. సంజౌలిలో గురువారం నాటి నిరసన తర్వాత, శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు మసీదులో గుమిగూడడం మానుకోవాలని కోరారు. నిర్ణీత సమయానికి ప్రార్థనలు జరుగుతాయని, అయితే సమాజంలోని ప్రజలు భయపడుతున్నారని, అందువల్ల మసీదులో గుమిగూడవద్దని మసీదుకు చెందిన మౌలానా కోరారు. మౌలానా షాజాద్ మాట్లాడుతూ ఇక్కడి ముస్లిం సమాజానికి చెందిన చాలా మంది ప్రజలు బయటి రాష్ట్రాలకు చెందిన వారేనని, ఈ ఘటనతో భయాందోళనకు గురవుతున్నారని అన్నారు.
వివాదంపై మసీదు మౌలానా ఏం చెప్పారు?
మసీదుకు చెందిన మౌలానా కొన్ని లోటుపాట్లు ఉన్నాయని అంగీకరించారు. దాని వల్ల ఈ రోజు వరకు మసీదుపై వివాదం ఉంది. పురాతన కాలం నుండి ఇక్కడ ఉంది. ప్రజలు తమ మధ్య శాంతి, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవాలని మౌలానా విజ్ఞప్తి చేశారు.
మసీదు వివాదంలో తర్వాత ఏం జరుగుతుంది?
మసీదు నిర్మాణానికి సంబంధించిన వివాదం ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ కోర్టులో పెండింగ్లో ఉంది, దీనిపై శనివారం ముఖ్యమైన విచారణ జరగనుంది. తమ డిమాండ్లకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే వివాదం మరింత ముందుకు సాగదని, అయితే తమ డిమాండ్లకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఆగ్రహించి మళ్లీ నిరసనలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో పాటు హిందూ సంస్థలు ఇచ్చిన రెండు రోజుల అల్టిమేటం ఆదివారంతో ముగియనుండగా, ఆ తర్వాత మరింత టెన్షన్ పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!