Hero MotoCorp : భారీ లాభాల్లో హీరో మోటో కార్ప్.. ఒక్కో షేరుకు రూ.100డివిడెండ్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero MotoCorp : ద్విచక్ర వాహన రంగంలో అతిపెద్ద కంపెనీ హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించింది. కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 51 శాతం పెరిగి రూ.1073.4 కోట్లకు చేరుకుంది. శుక్రవారం కంపెనీ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. భారీ లాభాలు రావడంతో ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ.100 డివిడెండ్ కూడా ప్రకటించింది. నిపుణులు కూడా కంపెనీకి మంచి లాభాలను అంచనా వేశారు.
Read Also:Karnataka: వార్నీ.. ఆపరేషన్ థియేటర్లో ఫ్రీ వెడ్డింగ్ షూట్.. చివరికి..
Also Read
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
- BRICS: బ్రిక్స్లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో తమ ఆదాయం రూ.9723.7 కోట్లుగా ఉందని హీరో మోటో కార్ప్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 8031కోట్లు. కంపెనీ EBITDA మార్జిన్ కూడా వార్షిక ప్రాతిపదికన 250 బేసిస్ పాయింట్లు పెరిగి 14 శాతానికి చేరుకుంది. పండుగ సీజన్లో కంపెనీ విక్రయాలు ఇప్పటివరకు అత్యధికంగా నమోదయ్యాయి. ఆ 32 రోజుల్లో కంపెనీ సుమారు 14 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. 100 డివిడెండ్ను బోర్డు ప్రకటించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో రూ.75 మధ్యంతర డివిడెండ్, రూ.25 ప్రత్యేక డివిడెండ్. శుక్రవారం త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు, హీరో మోటో కార్ప్ షేర్లు బిఎస్ఇలో 2.10 శాతం పెరిగి రూ.4,908.5 వద్ద ముగిసింది.
Read Also:Hyderabad: పాత ఇళ్లకు ఫుల్ డిమాండ్..! కొత్త వాటితో పోటీగా సేల్స్..!
టూవీలర్ కంపెనీ సీఈవో నిరంజన్ గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడం ద్వారా దేశంలో వ్యాపార, ఆర్థిక వాతావరణాన్ని కల్పించామన్నారు. ఇది మరింత వృద్ధికి దారి తీస్తుంది. ఉపాధి కూడా పెరుగుతుంది. మేము ఇటీవల విడుదల చేసిన మోడళ్లకు మార్కెట్ నుండి మంచి స్పందన వచ్చింది. హీరో మోటో కార్ప్ త్వరలో అనేక ఉన్నత ప్రీమియం మోడళ్లను విడుదల చేయనుంది. జనవరిలో జరిగిన హీరో వరల్డ్ ఈవెంట్ సందర్భంగా, కంపెనీ ఎక్స్ట్రీమ్ 125ఆర్, మావెరిక్ 440లను విడుదల చేసింది. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో తమ పనితీరు మరింత మెరుగ్గా ఉండగలదని కంపెనీ పూర్తి ఆశతో ఉంది. ఏథర్ సహకారంతో దేశవ్యాప్తంగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేస్తున్నామని నిరంజన్ గుప్తా తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలో కంపెనీ 100 నగరాలకు చేరుకుంది. రానున్న కాలంలో దీన్ని మరింత విస్తరించనున్నారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!