ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా లేకుండా ప్రతి ఒక్కరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.. ఈ వ్యాధి సైలెంట్ కిల్లర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ వ్యాధి మొదటి సంకేతాలు ఎలా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు ఎలా తెలుస్తుంది? అంటే చాలా లక్షణాలు కనిపిస్తాయిన చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయాన్నే శరీరంలో కనిపించే లక్షణాలు డయాబెటిస్కు సంకేతాలుగా పేర్కొంటున్నారు. ఆ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ వ్యాధి లక్షణాల విషయానికొస్తే..ఉదయం వేళ రక్తంలో చక్కెర స్థాయిలు భారీగా పెరుగుతాయి. గొంతు, నోరు పొడిబారినట్లుగా ఉంటుంది. ఇక రాత్రంతా తరచుగా మూత్రవిసర్జన చేస్తారు. మూత్రాశయం నిండటం, దృష్టి సరిగా లేకపోవడం, తరచుగా ఆకలి వేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మధుమేహం లక్షణాల్లో తొలుత తీవ్ర అలసట, నిద్రలేమి, కళ్లలో బలహీనత, షంగల్ ఇన్ఫెక్షన్లు, కురుపులు, అధిక దాహం, బరువు తగ్గడం, నయం కాని గాయాలు, ప్రైవేట్ పార్ట్లో దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఇవే కాదు చేతులు, కాళ్లలో వణుకు, అకస్మాత్తుగా బరువు తగ్గడం, అలసట, బలహీనత, చర్మం పొడిబారడం, ఇన్ఫెక్షన్లు, జుట్టు రాలడం, శరీరంలో రక్తం తగ్గడం, వికారం, కడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి..
ఇలాంటి మార్పులు కనిపిస్తే వెంటనే నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.. ఈ వ్యాధి ఏ వయస్సులోనైనా వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుత కాలంలో పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు, యువకులు టైప్ 1 మధుమేహం బారిన పడుతున్నారు. టైప్ 2 మధుమేహం 40 ఏళ్ల తరువాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధుమేహం మూత్రపిండాలు, గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.. ప్రతి ఒక్కరిలో షుగర్ లెవల్స్ ఒక్కోసారి పెరగడం, తగ్గడం జరుగుతుంది.. షుగర్ వ్యాధి గ్రస్తులు వైద్యుల సలహాలతో ఆహారాన్ని తీసుకోవడం మంచిది..