Site icon NTV Telugu

Petrol Tanker: పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. 15 మంది మృతి, 40 మందికి గాయాలు..

Petrol Tank

Petrol Tank

Petrol Tanker: శనివారం హైతీలో గ్యాసోలిన్‌తో వెళ్తున్న ట్యాంకర్ ట్రక్కు బోల్తాపడి పేలి 15 మంది మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి వ్యాఖ్యానించడానికి హైతీ అధికారులు సుముఖత చూపించలేదు. హైతీలోని ఆసుపత్రుల్లో తీవ్రంగా కాలిన రోగులకు చికిత్స చేయడానికి తగిన సౌకర్యాలు లేవు. ఈ ఘటన బలూచిస్థాన్‌ లోని జోబ్ జిల్లాలోని ధన సార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కోట్ల జనాభా ఉన్న ఈ దేశం కూడా ఇంధన కొరతతో సతమతమవుతోంది. ముఠాల మధ్య తగాదాల కారణంగా దేశంలోకి వస్తువులను దిగుమతి చేసుకోవడం కష్టతరంగా మారింది. 60,000 మంది జనాభా ఉన్న మిరాగోనేలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతం మూడేళ్ల క్రితం శక్తివంతమైన భూకంపం బారిన పడింది.

Crime: ఏఐతో న్యూడ్ వీడియోస్ రూపొందించి.. 50 మంది కాలేజీ అమ్మాయిలను బ్లాక్‌మెయిల్

ఇక మరో ఘటనలో పాకిస్థాన్‌ లోని నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శనివారం ప్రయాణికుల బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. ప్రావిన్స్‌ లోని జోబ్ జిల్లాలోని ధన సార్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. వారు మృతదేహాలను, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్థానిక వాలంటీర్లు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. టర్న్‌ తీసుకుంటుండగా బస్సు డ్రైవర్‌ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఫెడరల్ క్యాపిటల్ ఇస్లామాబాద్ నుంచి ప్రావిన్షియల్ క్యాపిటల్ క్వెట్టాకు బస్సు వెళ్తోందని ఆయన చెప్పారు.

PHC Doctors: నేడు ఛలో విజయవాడకు పీహెచ్సీ వైద్యుల సంఘం పిలుపు..

Exit mobile version