Madhyapradesh : పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఎన్నో కలలు కంటారు. కొత్త వివాహంలో ఇద్దరూ ఒకరినొకరు బాగా చూసుకుంటారు. ఎందుకంటే అది ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం ఇదే. భార్యాభర్తలు కూడా ఎవరి అంచనాలను వారు కలిగి ఉంటారు. భవిష్యతులో వారు ఎప్పుడు విడిపోవద్దని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు మొండితనం ఈ సంబంధానికి ఊహించని మలుపును ఇస్తుంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఓ యువకుడు, యువతి పెళ్లి చేసుకున్న ఇలాంటి షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది.
Read Also:School Holiday: భారీ వర్షాల ఎఫెక్ట్.. రేపు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు..
ఇద్దరూ ఒకరినొకరు అమితంగా ప్రేమించుకున్నారు. అడుగడుగునా ఒకరికొకరు ప్రతి చిన్న, పెద్ద అవసరాలను తీర్చుకుంటారు. తద్వారా ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఓ భార్య తన భర్తకు పోహా తినడమంటే చాలా ఇష్టమని, అందుకే తనకి మంచి పోహ పెట్టమని భర్తను కోరింది. కానీ పోహ చేయడానికి నిరాకరించిన భర్త, రోజు ఇంట్లో ఉంచిన డ్రై ఫ్రూట్స్ తినమని భార్యను కోరాడు. దీంతో భర్తపై భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆమె ఊహించని స్టెప్ తీసుకుంది.
Read Also:CM Revanth Reddy: అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దు.. టెలి కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్..
పోహ చేయడానికి బాలకిషన్ నిరాకరించడంతో కవితకు కోపం వచ్చి ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొంత సేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కవిత గదిలోకి వెళ్లి లోపలి నుంచి తలుపు వేసింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో బాలకిషన్ తలుపు తట్టి కేకలు వేశాడు. ఇంత చేసినా తలుపు తెరవకపోవడంతో బాలకిషన్ తలుపులు పగలగొట్టి ముందు చూసేసరికి కవిత ఉరివేసుకుని ఉంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కవిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
