NTV Telugu Site icon

Gutha Sukender Reddy : శాస్త్రీయమైన పద్ధతుల్లో కృష్ణా నది జలాల పంపిణీ జరగాలి..

Gutha Sukender Reddy

Gutha Sukender Reddy

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం స్వాగతిస్తున్నానని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన నల్లగొండ జిల్లాలో మీడియాతో చిట్‌ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని ఆయన కోరారు. శాస్త్రీయమైన పద్ధతుల్లో కృష్ణా నది జలాల పంపిణీ జరగాలని, కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు గుత్తా సుఖేందర్‌ రెడ్డి. 7 మండలాలు తిరిగి తెలంగాణకు రాకపోవచ్చని, 5 గ్రామాలు తెలంగాణకు వచ్చే ఛాన్స్ ఉందన్నారు సుఖేందర్‌ రెడ్డి. అంతేకాకుండా.. ఇన్కమ్ టాక్స్ కట్టేవాళ్లను, పెద్ద ఎత్తున జీతాలు తీసుకునే వాళ్లకు రుణమాఫీ, రైతు భరోసా వద్దన్నారు. సేద్యం కానీ భూమికి రైతు భరోసా వద్దని, మండలి రద్దు అవుతుంది అనేది ఉహజనీతమేనన్నారు. అనర్హత వేటు పిటిషన్ లపై గత చైర్మన్ లు, కోర్ట్ తీర్పులు, నిబంధనలను బట్టి నా నిర్ణయం ఉంటుందని, 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉండొచ్చు.. అదే జరిగేతే తెలంగాణ, ఏపీ లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతాయన్నారు గుత్తా సుఖేందర్‌ రెడ్డి. నల్లగొండ జిల్లాలో పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు.