NTV Telugu Site icon

8th Pay Commission: ఉద్యోగులకు ప్రభుత్వం షాక్… ఇప్పట్లో 8వ వేతన సంఘం లాంటివేం లేవు

Money

Money

8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందిస్తూ.. అలాంటి ప్రతిపాదనేమీ ప్రభుత్వం ముందు పరిశీలనలో లేదని చెప్పారు. 7వ వేతన సంఘంలోని పేరా 1.22ను పరిగణనలోకి తీసుకోకపోవడానికి, ఆమోదించకపోవడానికి ఫైళ్లలో ఎలాంటి కారణాలు నమోదయ్యాయని రాజ్యసభ సభ్యుడు రామ్‌నాథ్ ఠాకూర్ ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందిస్తూ.. ఏడవ వేతన సంఘం ఆధారంగా వేతనాలు, అలవెన్సుల సవరణకు ఆమోదం తెలిపే సమయంలో కేంద్ర మంత్రివర్గం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

Read Also:Health Tips : పరగడుపున తులసి నీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఏడవ వేతన సంఘం నివేదికలోని పేరా 1.22లో 5 సంవత్సరాల తర్వాత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సమీక్షించాలని సిఫార్సు చేయబడింది. ఇది కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపునకు మార్గం సుగమం చేస్తుంది. కానీ ప్రభుత్వం అమలు చేయకుండా తప్పించుకుంటోంది. పే కమీషన్ భారాన్ని ప్రభుత్వం భరించే స్థితిలో లేనందున ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయడం లేదా అని ఆర్థిక మంత్రిని కూడా అడిగారు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న ప్రభుత్వం గత 30 ఏళ్లుగా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న కేంద్ర ఉద్యోగుల జీతాలను సమీక్షించేందుకు ఎనిమిదో వేతన సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందిస్తూ, ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని చెప్పారు.

Read Also:Gold Price Today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?

పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని కేంద్ర ఉద్యోగులు నిరంతరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ పెంచడానికి ప్రభుత్వం కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. పే కమిషన్ తన నివేదిక మరియు సిఫార్సులను సమర్పించడానికి 18 నెలల సమయం ఉంది. 7వ వేతన సంఘం 2014లో ఏర్పాటైంది. దాని సిఫార్సులు జనవరి 1, 2016 నుండి అమలు చేయబడ్డాయి.