NTV Telugu Site icon

Monsoon Session : వర్షాకాల సమావేశాల్లో ఆరు కొత్త బిల్లులకు ఆమోదం ?

Parliament Monsoon Session

Parliament Monsoon Session

Monsoon Session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఆరు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇందులో ఫైనాన్స్ బిల్లు, విపత్తు నిర్వహణ, బాయిలర్స్ బిల్లు, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ బిల్లు, కాఫీ ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్ బిల్లు, రబ్బర్ ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్ బిల్లు ఉన్నాయి. వీటితో పాటు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చర్చించనున్నారు. డిమాండ్ ఫర్ గ్రాంట్స్‌పై చర్చ, ఓటింగ్ కూడా ఉంటుంది. ఈ సెషన్‌లో విభజన బిల్లు ఆమోదం పొందనుంది. వీటన్నింటితో పాటు జమ్మూకశ్మీర్ బడ్జెట్‌ను చర్చల అనంతరం ఆమోదించనున్నారు.

Read Also:Muslim Marriages: అస్సాంలో ముస్లిం వివాహాలు, విడాకుల చట్టం రద్దు బిల్లుకు ఆమోదం

వాస్తవానికి వచ్చే వారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపత్తు నిర్వహణ చట్టాన్ని సవరించే బిల్లుతో సహా ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక బిల్లుతో పాటు, పౌర విమానయాన రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1934 స్థానంలో ప్రభుత్వం ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ బిల్లు 2024ని కూడా తీసుకు రానున్నారు. గురువారం సాయంత్రం లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన పార్లమెంట్ బులెటిన్‌లో బిల్లుల జాబితాను ప్రచురించారు. వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి.

Read Also: IND vs SL: భారత జట్టులో చోటు కోల్పోయిన స్టార్ ప్లేయర్ల జాబితా ఇదే!

జూలై 23న కేంద్ర బడ్జెట్‌
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సెషన్‌లో ప్రవేశపెట్టబడిన, ఆమోదించబడే ఇతర బిల్లులలో స్వాతంత్ర్యానికి పూర్వపు చట్టాన్ని భర్తీ చేయడానికి బాయిలర్స్ బిల్లు, కాఫీ (ప్రమోషన్, డెవలప్ మెంట్) బిల్లు, రబ్బరు (ప్రమోషన్, డెవలప్ మెంట్) బిల్లు ఉన్నాయి.