Site icon NTV Telugu

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త… ఈ ఏడాది 70 శాతమే సిలబస్

inter exams 1

తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ లో 70 శాతం సిలబస్ ఉండనున్నట్లు ప్రకటన చేసింది. ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు 70 శాతం సిలబస్ నుండే పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది తెలంగాణ ఇంటర్‌ బోర్డు. కోవిడ్ నేపథ్యం, విద్యా సంస్థలలో భౌతిక తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో 70 శాతం సిలబస్ తోనే విద్యా సంవత్సరం నిర్వహిస్తామని తెలిపింది. ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ లో ఈ సిలబస్ గురించి పూర్తి డీటెయిల్స్ ఉంటాయని స్పష్టం చేసింది ఇంటర్‌ బోర్డు. గత విద్యా సంవత్సరం కూడా 70 శాతం సిలబస్ నుండే ఇంటర్ పరీక్షలు నిర్వహించామని గుర్తు చేసింది బోర్డు. అలాగే…ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ గడువు మరో సారి పొడగిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే పలు మార్లు పొడగించిన ఇంటర్ బోర్డ్… తాజాగా ఈ నెల 30 వరకు పొడగిస్తున్నట్లు తెలిపింది.

Exit mobile version