బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ కూడా స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తుంది.. శనివారం 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 57,890కి చేరింది.. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 63,150కి చేరింది. ఇక వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 75,100కి చేరింది.. దేశంలో ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,380గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,700గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,890గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,150గాను ఉంది.. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,040గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,300గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,890 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,150గా ఉంది. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,890గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,150గా నమోదైంది.ఇక మిగిలిన అన్ని ప్రాంతాల్లో ధరలు ఇలానే ఉన్నాయి..
వెండి ధర విషయానికొస్తే.. నిన్న కాస్త తగ్గిన ధరలు ఈరోజు కాస్త పెరిగినట్లు తెలుస్తుంది.. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 75,100కి చేరింది. గురువారం ఈ ధర రూ. 75,000గా ఉండేది.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 76,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 74,400.. బెంగళూరులో రూ. 72,600గా ఉంది.. ఇక రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..