NTV Telugu Site icon

Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?

Gold

Gold

బంగారానికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.. మార్కెట్ లో పెరిగిన తగ్గిన మహిళలు మాత్రం కొనకుండా అస్సలు ఉండరు. అందులో శ్రావణమాసం మొదలువ్వడంతో అందరు నగల పై ద్రుష్టి పెట్టారు.. నిన్న మార్కెట్ ధర కాస్త తగ్గింది.. దీంతో ఈరోజు కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి.. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,100 గా ఉండగా.. 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,020 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1000 మేర పెరిగి రూ.73,500 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

# ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,250, 24 క్యారెట్ల ధర రూ.59,170 గా ఉంది..
# ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,100, 24 క్యారెట్లు రూ.59,020 వద్ద ఉంది.
# చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,550, 24 క్యారెట్ల ధర రూ.59,510 కొనసాగుతుండగా..
# బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,020,
# కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,100, 24 క్యారెట్ల ధర రూ.59,020 ఉంది..
# కోల్‌కతాలో బంగారం 22 క్యారెట్ల ధర రూ.54,100, 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,020గా ఉంది.
# తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,100 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,020 లుగా ఉంది.

బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి.. ఈరోజు కిలో పై ఏకంగా వెయ్యి పెరిగింది.. ఈరోజు ధరలు.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,500 లుగా ఉండగా.. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,700, ముంబైలో కిలో వెండి ధర రూ.73,500 లుగా కొనసాగుతోంది. కేరళలో కిలో వెండి ధర రూ.76,700, బెంగళూరులో రూ.72,500, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,500 లుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,700 గా నమోదు అయ్యాయి.. ఇక రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..