Gold Bond: రూ. 5,926కి గోల్డ్ బాండ్ ఇస్తున్న ప్రభుత్వం.. సోమవారం నుంచి షురూ

Gold

Gold

Gold Bond: సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2023–24 తొలి విడత సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. బంగారం జారీ ధరను గ్రాముకు రూ.5,926గా ఆర్థికశాఖ ప్రకటించింది. ఐదు రోజుల పాటు (19–23) స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే ప్రకటిత ధరలో గ్రాముకు రూ.50 రిబేట్‌ లభిస్తుంది. అంటే ఆన్‌లైన్‌ ధర గ్రాముకు రూ.5,876గా ఉంటుందన్నమాట.

Read Also:Ration Dealership: తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం.. రేషన్ డీల‌ర్‌షిప్ వయసు పరిమితి పెంపు

ప్రభుత్వం, ఆర్‌బిఐతో సంప్రదింపులు జరిపి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని డిజిటల్ మోడ్‌లో చెల్లింపు చేసే పెట్టుబడిదారులకు ఇష్యూ ధర నుండి గ్రాముకు రూ. 50 తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించింది. అటువంటి పెట్టుబడిదారులకు గోల్డ్ బాండ్ల జారీ ధర గ్రాముకు రూ.5,876గా ఉంటుంది. బాండ్లను బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నియమించబడిన పోస్టాఫీసులు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ ద్వారా విక్రయించబడతాయి.

Read Also:Gujarat: ఉద్రిక్తతలకు దారితీసిన.. దర్గాకు నోటీసుల జారీ

భౌతిక బంగారం డిమాండ్‌ను తగ్గించడం, బంగారం కొనుగోలు చేయడానికి ఉపయోగించే గృహాల పొదుపులో కొంత భాగాన్ని ఆర్థిక పొదుపులకు బదిలీ చేసే లక్ష్యంతో ఈ పథకం నవంబర్ 2015లో ప్రారంభించబడింది. గోల్డ్ బాండ్ ధరను ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ 999 స్వచ్ఛత కలిగిన బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా నిర్ణయించింది. బాండ్ కాలపరిమితి 8 సంవత్సరాలు ఉంటుంది. ఈ పథకంలో కనీసం ఒక గ్రాము బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి వ్యక్తికి 4 కిలోలు, ట్రస్టులకు 20 కిలోలు.