Site icon NTV Telugu

Suicide : బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య

Suicide

Suicide

ఏపీలోని అనకాపల్లి జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని దారుణంగా హతమార్చిన నిందితుడు సురేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబిల్లి మండలం కొప్పగుండుపాలెం శివారులో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 6న సురేశ్ దర్శిని ఇంటికి వెళ్లి కత్తితో దారుణంగా చంపేశాడు. ప్రేమ పేరుతో వేధించడంతో దర్శిని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేశ్ జైలుకు వెళ్లాడు. ఆ కోపంతోనే హతమార్చినట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంనకు చెందిన బద్ది దర్శిని రాంబిల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 6న ఆమె స్కూల్‌కు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది.. కొద్దిసేపటి తర్వాత ఆ ఇంట్లోంచి బోడాబత్తుల సురేష్‌ అనే యువకుడు బయటికి రావడాన్ని బాలిక నానమ్మ గమనించారు. ఆమెకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా.. బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే చుట్టుపక్కలవారిని పిలిచి చూడగా.. బాలిక అప్పటికే చనిపోయినట్లుగా గుర్తించారు.

 

Exit mobile version