టాలీవుడ్ టాప్ సింగర్ గీతా మాధురి మరోసారి తన బోల్డ్ స్టేట్మెంట్స్తో వార్తల్లో నిలిచారు. పాటలతోనే కాకుండా, తన సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ప్రేక్షకులను అలరించే గీత, తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గాయకుడు నోయెల్ (Noel) నిర్వహిస్తున్న యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న ఆమె, సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
గీతా మాధురి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడో ఒకసారి కాఫీ షాప్కు వెళ్తాను. కానీ నేను వెళ్లినప్పుడే ఎవరో ఒక ప్రేమ జంట అక్కడ దొరికిపోతారు. ఇలా చాలా మందిని నేను రెడ్ హ్యాండెడ్గా చూశాను’ అని నవ్వుతూనే బాంబ్ పేల్చారు. అంతటితో ఆగకుండా, ‘నేను చూసినవి బయటపెడితే చాలా మంది కాపురాలు కూలిపోతాయి’ అంటూ ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గీతా మాధురి మాటలను బట్టి చూస్తే, ఆమె చూసిన ఆ జంటల్లో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవ్వుతూనే గీత అంత పెద్ద మాట అనడంతో, ఆ సీక్రెట్ కపుల్స్ ఎవరు? అది అక్రమ సంబంధాలా లేక సీక్రెట్ అఫైర్లా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే పూర్తి ఎపిసోడ్ విడుదలయ్యే వరకు ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారో క్లారిటీ వచ్చేలా లేదు.
