Gambhir vs Rohit Sharma: ఇదే నీ వీడ్కోలు మ్యాచ్.. రోహిత్ శర్మతో గంభీర్ వ్యాఖ్యలు వైరల్!

  • టీమిండియాలో కొనసాగుతున్న విభేదాలు..
  • రోహిత్ శర్మకు ఇదే చివరి మ్యాచ్ అంటూ గంభీర్ కామెంట్స్..
  • గంభీర్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్న రోహిత్ ఫ్యాన్స్..
Gambir Rohit

Gambir Rohit

Gambhir vs Rohit Sharma: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ను టీమిండియా 0- 2 తేడాతో చేజార్చుకుంది. ఈ సందర్భంగా భారత్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మతో మాట్లాడుతున్న ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో గంభీర్, రోహిత్‌తో ఇలా అంటున్నాడు.. “రోహిత్, అందరికీ ఇది నీ వీడ్కోలు మ్యాచ్ అనుకుంటున్నారు.. కనీసం ఒక ఫోటో అయినా పెట్టండి” అని పేర్కొన్నారు. కాగా, ఈ వీడియో నెట్టింట విస్తృతంగా షేర్ అవుతుంది. అయితే, గంభీర్ చేసిన ఈ కామెంట్స్ సరదాగా చేసిందా లేక నిజంగానే అన్నారా అనేదానిపై అభిమానులు చర్చించుకుంటున్నారు.

Read Also: Pregnant Woman in Doli: ఏజెన్సీలో తప్పని కష్టాలు.. అర్ధరాత్రి 3 కిలో మీటర్లు పురిటి నొప్పులతో డోలీలో గర్భిణి..

కాగా, పెర్త్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌తో తుది జట్టులోకి తిరిగి వచ్చిన రోహిత్, ఆ మ్యాచ్‌లో కేవలం ఎనిమిది రన్స్ మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం విమర్శలను ఎదుర్కొన్నాడు. కానీ, అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో అతను 73 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక, శ్రేయాస్ అయ్యర్ ( 61) పరుగులతో కలిసి రోహిత్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా, రోహిత్‌ను ODI కెప్టెన్సీ నుంచి తొలగించినప్పటి నుంచి 2027 ODI ప్రపంచ కప్ జట్టులో అతడి స్థానంపై తీవ్రంగా చర్చ కొనసాగుతుంది.