NTV Telugu Site icon

Gang War: గ్యాంగ్ ల మధ్య భీకర కాల్పులు.. ముగ్గురు మృతి..

Gang War

Gang War

Gang War: హర్యానాలోని రోహ్‌తక్‌లో ఒక్కసారిగా గ్యాంగ్ వార్ జరిగింది. రాహుల్ బాబా, ప్లాత్రా గ్యాంగ్ మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. అలాగే ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం ప్రకారం, రోహ్‌తక్‌ లోని సోనిపట్ రోడ్‌ లోని బలియానా మోర్ సమీపంలోని మద్యం దుకాణం వద్ద కూర్చున్న ఐదుగురు యువకులపై మోటారు సైకిల్ పై వచ్చిన యువకులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బుల్లెట్లు పేల్చడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బుల్లెట్ కారణంగా మద్యం దుకాణం వద్ద కూర్చున్న ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు యువకులు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Hyderabad Student: ఫిలిప్పీన్స్ లో నిజామాబాద్ విద్యార్థి మృతి..

రోహ్‌తక్‌ లోని సోనిపట్‌ రోడ్డులోని బలియానా మలుపు వద్ద గురువారం రాత్రి బోహార్‌కు చెందిన యువకులు మద్యం దుకాణం వద్ద కూర్చున్నట్లు పోలీసుల నుంచి అందిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దాదాపు ఎనిమిది మంది యువకులు బైక్‌పై వచ్చి రాగానే విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. బోహార్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బుల్లెట్ గాయాలతో మరణించారు. కాగా., ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు పాత కక్షతో ముడిపడి ఉన్నట్టు సమాచారం. 2019లో కోర్టు వెలుపల కాల్పులు జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కాల్పుల్లో, బోహార్ గ్రామానికి చెందిన ప్లాత్రా అనే యువకుడు అరెస్టు చేయబడ్డాడు. అతను ఇప్పుడు జైలులో ఉన్నాడు. దానితో ఈ ఘటన ముడిపడి ఉంది.

IND vs BAN Test: ముగిసిన భారత్ మొదటి ఇన్నింగ్స్.. 376 ఆలౌట్..

సోనిపట్‌ రోడ్డులోని ఓ మద్యం దుకాణంలో కాల్పులు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని, అందులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారని, కొందరు దుండగులు బైక్‌పై వెళ్తున్నారని ఎస్పీ రోహ్‌తక్‌ హిమాన్షు గార్గ్‌ తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారని, విచారణ వెలుగులోకి వచ్చిన వెంటనే మీడియాకు సమాచారం అందజేస్తామన్నారు.