భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన IndiGoలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. పీపీటర్ ఎల్బర్స్ మార్చి 2026లో తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత CEO పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేసిన తరువాత, ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్లైన్ ఎగ్జిక్యూటివ్ విల్లీ వాల్ష్ ను కొత్త CEOగా నియమించారు. ఇండిగో భారతదేశంలో సుమారు 65% మార్కెట్ షేర్ కలిగిన పెద్ద ఎయిర్లైన్. ఇలాంటి కంపెనీలో CEO మార్పు అంటే మొత్తం విమానయాన రంగంపై ప్రభావం ఉంటుంది. కొత్త పాలసీలు, వ్యూహాలు వస్తాయి.
Also Read:CM Chandrababu: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక, ప్రతి నెల ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’
ఎవరు ఈ విల్లీ వాల్ష్?
విల్లీ వాల్ష్ అంతర్జాతీయ విమానయాన రంగంలో అనుభవజ్ఞుడు. ప్రస్తుతం International Air Transport Association (IATA) డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ముందుగా British Airways CEOగా పనిచేశారు. 2026 జూలై 31 వరకు IATAలో పని చేసి, ఆగస్టు 2026లో ఇండిగోలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండిగో ఇప్పుడు గ్లోబల్ స్థాయి అనుభవం ఉన్న నాయకుడిని తీసుకువచ్చింది.
