NTV Telugu Site icon

Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..

Building Fire

Building Fire

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.. మైలార్ దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక టాటానగర్ లోని ఓ ప్లాస్టిక్ గోడైన్‌లో రాత్రివేళ ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.. ఆ మంటలను చూసి జనం భయబ్రాంతులకు గురయ్యారు..

ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయి.. చుట్టు కొద్ది కిలోమీటర్ల మేరకు దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టు పక్కల ఉన్న జనాలకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వేగంగా వచ్చారు. అప్పటికే మంటలు భారీగా వచ్చేశాయి. వాటిని కంట్రోల్ లోకి తేవడానికి 4 గంటలు పట్టింది. మంటల్లో ప్రాణ నష్టం ఏదీ లేదని తెలుస్తోంది. ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉండొచ్చని అంటున్నారు అధికారులు..

మంటలు అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.. ఈ ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందగానే హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.. అసలు ఈ మంటలు ఎందుకొచ్చాయి? షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చాయా? ఎవరైనా కావాలని కుట్ర చేశారా? అనే అనుమానాలు ఉన్నాయి. అధికారులు పరిశీలిస్తున్నారు… ఈ ప్రమాద సమయంలో గోడౌన్ లో ఎవ్వరు లేరని తెలుస్తుంది.. దాంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.. ఈ అగ్ని ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..