Fake Medicine : తక్షణమే ఆసుపత్రుల్లో నకిలీ మెడిసిన్స్ ఉంటే తీసేయండి.. విజిలెన్స్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Medicine : ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాసిరకం మందులు ఇస్తున్నారనే అంశం ఇప్పుడు ఊపందుకుంది. ల్యాబ్ పరీక్షలో విఫలమైన మందులను అన్ని ఆసుపత్రుల నుండి వెంటనే తొలగించాలని విజిలెన్స్ విభాగం ఆదివారం ఢిల్లీ ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించింది. విజిలెన్స్ విభాగం చట్టపరమైన ప్రక్రియను అనుసరించి నాణ్యత లేని మందులను వెంటనే జప్తు చేయాలని పేర్కొంది. ల్యాబ్ టెస్ట్లో ఫెయిల్ అయిన మందుల స్టాక్ను వెంటనే ఆసుపత్రుల నుంచి తొలగించాలని, తద్వారా భవిష్యత్తులో ప్రమాణాలు పాటించని మందులు రోగులకు చేరకుండా చూసుకోవాలని విజిలెన్స్ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. . దీనితో పాటు ఈ మందులను సరఫరా చేసే లేదా విక్రయించే పంపిణీదారులు లేదా మందుల తయారీదారులకు తదుపరి చెల్లింపులు చేయవద్దని కూడా ఆదేశాలు ఇవ్వబడ్డాయి.
Read Also:Mission Chapter 1: సంక్రాంతి బరిలో చేరిన ఇంకో సినిమా.. ?
Also Read
- Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
- Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
- India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
- INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
ఔషధాల తయారీ కంపెనీలు, సరఫరాదారులకు ఇప్పటివరకు ఎంత చెల్లింపు జరిగింది.. ఎంత చెల్లింపు బకాయి ఉంది అనే సమాచారాన్ని కూడా డిపార్ట్మెంట్ హెల్త్ సెక్రటరీ నుండి కోరింది. మందుల కొనుగోలుకు సంబంధించిన అన్ని పత్రాలతో పాటు టెండర్ ప్రక్రియకు సంబంధించిన పత్రాలు, దానికి సంబంధించిన ఫైళ్లను వెంటనే స్వాధీనం చేసుకుని డిసెంబర్ 26లోగా ఈ పత్రాలను విజిలెన్స్ విభాగానికి అందజేయాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని కోరారు. దీనితో పాటు రాబోయే 48 గంటల్లో తీసుకున్న చర్యలపై చర్య తీసుకున్న నివేదికను కూడా దాఖలు చేయాలని కోరింది. మరోవైపు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. రోగుల చికిత్సకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా నాసిరకం మందుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదివారం ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఇప్పటి వరకు మందులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై ఆరోగ్య మంత్రి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also:Pawan Kalyan: అనాథ పిల్లలతో పవన్ భార్య క్రిస్టమస్ వేడుకలు.. ఫోటోలు వైరల్
డీజీహెచ్ఎస్, ఆసుపత్రుల ద్వారా ప్రామాణిక నాణ్యతతో కూడిన మందుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి మంత్రి వారంలోగా సమాచారం కోరారు. దీనితో పాటు, 15 రోజుల్లో అన్ని అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా ఒక ఎస్ఓపీను రూపొందించాలని ఆరోగ్య కార్యదర్శిని కోరారు.
తాజావార్తలు
-
Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
-
Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
-
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన హాలీవుడ్ సినిమాలు.. థ్రిల్లర్ల నుంచి, ఫాంటసీ వరకు
-
December Fight : సంక్రాంతి తర్వాత హాట్ స్లాట్గా డిసెంబర్
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!