Accident : పూరీలో జగన్నాథుని చందన్ యాత్రలో బాణాసంచా పేలుడు.. 15 మందికి తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Accident : ఒడిశాలోని పూరీలో బుధవారం రాత్రి జగన్నాథుని చందన్ యాత్ర ఉత్సవాల్లో బాణాసంచా పేలడంతో 15 మందికి కాలిన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో నరేంద్ర పుష్కరిణి సరోవర్ ఒడ్డున వందలాది మంది ప్రజలు పూజలు చూసేందుకు గుమిగూడారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సందర్భంగా కొందరు భక్తులు బాణాసంచా పేలుస్తుండగా నిప్పురవ్వ పడి పేలుడు సంభవించింది. మంటలు చెలరేగుతున్న బాణాసంచా ఘటనా స్థలంలో గుమికూడి ఉన్న వారిపై పడిందని, కొందరు తమను తాము రక్షించుకునేందుకు రిజర్వాయర్లోకి దూకారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించామని, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుడు తెలిపారు.
Read Also:Astrology: మే 30, గురువారం దినఫలాలు
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చికిత్సకు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి భరిస్తామని తెలిపారు. పూరీ నరేంద్ర పూల్ దగ్గర జరిగిన ప్రమాదం గురించి వినడం బాధాకరమని సీఎం నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందేలా చూడాలని, ఏర్పాట్లను పర్యవేక్షించాలని చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేస్తూ, ‘పూరీ చందన్ యాత్రలో నరేంద్ర పుష్కరిణి దేవిఘాట్ వద్ద జరిగిన దురదృష్టకర ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారనే వార్త విని బాధపడ్డాను. భగవంతుని ఆశీస్సులతో గాయపడిన వారు త్వరగా చికిత్స పొంది ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను.
Read Also:Fire Accident: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. 16 కార్లు, 5 దుకాణాలు దగ్ధం
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!