Errabelli Dayakar Rao: ప్రభుత్వం మిర్చి రైతును ఆదుకోవాలి.. క్వింటాకు 25 వేల మద్దతు ధర చెల్లించాలి!
- ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన ఎర్రబెల్లి
- మిర్చి క్వింటాకు 25 వేల మద్దతు ధర చెల్లించాలి
- కేసీఆర్ పాలనలో తెలంగాణలో యూరియా కొరత లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో మిర్చి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, క్వింటాకు 25 వేల మద్దతు ధర ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మిర్చి రైతులను ఆదుకోవాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు రాజుల్లాగా బతికారని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సందర్శించారు. మార్కెట్లో రైతులను కలిసి పంటల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రబెల్లితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. మార్కెట్లో మిర్చి రైతులకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రైతులకు మద్దతు ధర లేకపోవడం వల్ల మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 25 వేల రూపాయల మద్దతు ధర చెల్లించాలంటూ నినాదాలు చేశారు. వారం రోజుల సమయం ఇస్తున్నాం అని, ఈలోపు మిర్చికి 25 వేల మద్దతు ధర ఇవ్వకపోతే బీఆర్ఎస్ తరఫున ఆందోళనలు చేపడతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
‘అబద్ధాలు చెప్పి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. బోనస్ వస్తది అని చెపితే.. రైతులు సన్నరకాలు సాగు చేశారు. రైతులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు మిర్చిని రూ.15000 కొనుగొలు చేస్తాం అని చెప్పింది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో యూరియా కొరత లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యూరియా కొరత వచ్చింది. మార్క్ ఫైడ్ ద్వారా మిర్చిని క్వింటాకు రూ.25000 కొనుగోలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి’ అని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!