Errabelli Dayakar Rao: ప్రభుత్వం మిర్చి రైతును ఆదుకోవాలి.. క్వింటాకు 25 వేల మద్దతు ధర చెల్లించాలి!
- ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన ఎర్రబెల్లి
- మిర్చి క్వింటాకు 25 వేల మద్దతు ధర చెల్లించాలి
- కేసీఆర్ పాలనలో తెలంగాణలో యూరియా కొరత లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో మిర్చి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, క్వింటాకు 25 వేల మద్దతు ధర ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మిర్చి రైతులను ఆదుకోవాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు రాజుల్లాగా బతికారని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సందర్శించారు. మార్కెట్లో రైతులను కలిసి పంటల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రబెల్లితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. మార్కెట్లో మిర్చి రైతులకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రైతులకు మద్దతు ధర లేకపోవడం వల్ల మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 25 వేల రూపాయల మద్దతు ధర చెల్లించాలంటూ నినాదాలు చేశారు. వారం రోజుల సమయం ఇస్తున్నాం అని, ఈలోపు మిర్చికి 25 వేల మద్దతు ధర ఇవ్వకపోతే బీఆర్ఎస్ తరఫున ఆందోళనలు చేపడతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
‘అబద్ధాలు చెప్పి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. బోనస్ వస్తది అని చెపితే.. రైతులు సన్నరకాలు సాగు చేశారు. రైతులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు మిర్చిని రూ.15000 కొనుగొలు చేస్తాం అని చెప్పింది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో యూరియా కొరత లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యూరియా కొరత వచ్చింది. మార్క్ ఫైడ్ ద్వారా మిర్చిని క్వింటాకు రూ.25000 కొనుగోలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి’ అని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!