NTV Telugu Site icon

Errabelli Dayakar : తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఇండ్లు కట్టించింది నేనే…

Errabelli Dayakar

Errabelli Dayakar

డబుల్ బెడ్ రూం ఇళ్లకోసం ప్రభుత్వ స్థలం లేకపోతే పాలకుర్తి నియోజకవర్గంలో రెండెకరాలు నాస్వంత ఖర్చులతో భూమి కొనుగోలు చేసి కట్టించానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇవాళ ఆయన జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇళ్లు లేని గ్రామాలు చాలా ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఇండ్లు కట్టించింది నేనే అని ఆయన వ్యాఖ్యానించారు. పేదలకు ఇండ్ల పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన కూడా కాంగ్రెస్ వాళ్లు పేదలను ఇండ్లలో నుండి అన్యాయంగా బయటికి పంపిస్తున్నారని, వారికి అధికారికంగా ఇల్లు ఇవ్వడం జరిగింది,కాలీ చేయించడం పద్దతి కాదన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. ప్రజా ప్రతినిథులను,అధికారులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళను కాళీ చేయించకండని, పార్టీలకు అతీతంగా ఇల్లు కట్టించామని, అందులో ఉన్నవాల్లందరూ పేదవారన్నారు ఎర్రబెల్లి దయాకర్‌ రావు. కలెక్టర్ ను కూడా రిక్వెస్ట్ చేశానని, పాలకుర్తి నియోజక వర్గంలో అన్ని అభివృద్ధి పనులు ఆగిపోయాయి,వాటిని పూర్తి చేయండన్నారు ఎర్రబెల్లి దయాకర్‌ రావు. ఉన్నవాటిని ధ్వంసం చేయకండన్నారు ఎర్రబెల్లి.

 
People Media Factory: కర్ణాటక ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌లోకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ