Drugs Party at Former MLA Pilot Rohith Reddy’s Farmhouse: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది.. పక్కా సమాచారంతో పోలీసులు ఫామ్హౌస్పై దాడులు నిర్వహించారు. ఈగల్ టీమ్ అధికారులు ఫామ్హౌస్పై ఆకస్మిక దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సైతం ఉన్నారు.. పోలీసులు రాగానే రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిద్ మిశ్రా ఫైరింగ్ ప్రారంభించాడు.. పోలీసులను భయపెట్టడానికి కాల్పులు జరిపాడు. నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. తుపాకీ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. ఇక ఫామ్హౌస్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందరికీ డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ డ్రగ్ టెస్టులో ఐదుగురికి పాజిటివ్ రాగా.. ఎంపీ పుట్టా మహేష్కి మాత్రం నెగెటివ్ వచ్చింది.. పైలట్ రోహిత్, రితేష్ రెడ్డి, నమిద్ మిశ్రా, కాశిక్ రవి, అర్జున్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది.. పార్టీలో పట్టుబడిన 10 మందిలో ఓ మహిళ సైతం ఉంది.. కాశిక్ రవితో కలిసి ఆ మహిళ వచ్చింది.
READ MORE: Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!
