యూపీఎస్సీ (UPSC) పరీక్ష ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన పరీక్షల జాబితాలో చేర్చబడింది. భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఇది అగ్రస్థానంలో ఉంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకు ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. ఈ ఏడాది యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 16న జరగనుంది. ఈ ప్రిలిమ్స్ అనేది ఒక క్వాలిఫైయింగ్ పేపర్. ఇందులో విజయం సాధించిన అభ్యర్థులు మాత్రమే మెయిన్స్ పరీక్షకు హాజరుకాగలరు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, వంటి దేశంలోని అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి, యూపీఎస్సీ పరీక్ష (టాప్ సర్కారీ నౌక్రీ)లో ఉత్తీర్ణులు కావాలి. అందులో ఉత్తీర్ణత సాధించడానికి ఎన్ని మార్కులు పొందాలో తెలుసా?
READ MORE: G7 Summit: G7 శిఖరాగ్ర సమావేశం అంటే ఏమిటి.. అందులో ఏ దేశాలు పాల్గొంటాయో తెలుసా..
యూపీఎస్సీ 2023 కటాఫ్ నుంచి, ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి మీరు ఎన్ని ప్రశ్నలను పరిష్కరించాల్సి ఉంటుందో మీరు ఊహించవచ్చు. గత సంవత్సరం, జనరల్ కేటగిరీ అభ్యర్థులు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో 38 ప్రశ్నలకు, EWS కేటగిరీ 34 ప్రశ్నలకు, OBC 37 ప్రశ్నలకు, SC 30 ప్రశ్నలకు, ST 24 ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం ద్వారా ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం 1 లేదా 2 ప్రశ్నలు ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు. దీని ఆధారంగా మీరు మీ వ్యూహాన్ని రూపొందించవచ్చు. యూపీఎస్సీ పరీక్ష ఓ అర్హత పేపర్. ఈ పేపర్లో ఉత్తీర్ణత సాధించకుండా మీరు IAS లేదా ఇతర ప్రభుత్వ సేవలలో అధికారి కాలేరు. CSAT స్కోర్ తుది ఫలితంలో లెక్కించబడదు.. కానీ అందులో ఉత్తీర్ణత సాధించకుండా మీరు ప్రిలిమ్స్లో విజయవంతంగా పరిగణించబడరు. యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలో హాజరు కావాలంటే, CSATలో కటాఫ్ మార్కులు సాధించడం అవసరం.