NTV Telugu Site icon

Bank fraud case: బ్యాంక్ మోసం కేసులో డీహెచ్‌ఎఫ్ఎల్ డైరెక్టర్ అరెస్ట్, జ్యుడీషియల్ కస్టడీ

Eeew

Eeew

బ్యాంక్ మోసం కేసులో డీహెచ్‌ఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాధవన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రూ.34,000 కోట్ల మోసం కేసులో గతంలోనే అరెస్ట్ అయ్యాడు. అయితే 2022, డిసెంబర్‌లో డిఫాల్ట్ బెయిల్ మంజూరు అయింది. సీబీఐ ఛార్జిషీట్ అసంపూర్తి ఉందన్న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. తాజాగా ధీరజ్ వాధవన్‌ను సీబీఐ సోమవారం రాత్రి ముంబైలో అరెస్ట్ చేసింది. అనంతరం ఢిల్లీ కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియం ఇచ్చిన ఫిర్యాదుపై 2022, జూన్‌లో సీబీఐ అరెస్ట్ చేసింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో ధీరజ్‌ను అరెస్ట్ చేసింది. నిధులను స్వాహా చేసేందుకు అనేక షెల్ కంపెనీలను సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే లావాదేవీలను దాచడానికి పుస్తకాలను తప్పుగా మార్చినట్లుగా గుర్తించారు.

తాజాగా ధీరజ్, అతని సోదరులకు లభించిన డిఫాల్ట్ బెయిల్ రద్దు కావడంతో వారిని సీబీఐ అరెస్ట్ చేసింది. 2023, డిసెంబర్ 8న యెస్ బ్యాంక్ కేసులో ఆరోగ్య కారణాలతో ధీరజ్ మధ్యంతర బెయిల్ పొందారు. బాంబే హైకోర్టు ఈ మధ్యంతర బెయిల్‌ను మే 2న సాధారణ బెయిల్‌గా మార్చింది. ఒక వారం తర్వాత తాజా పరిణామాలు అరెస్ట్‌కు దారి తీశాయి.