Site icon NTV Telugu

Paris Olympics 2024: కాంస్య పతకాన్ని కోల్పోయిన ధీరజ్, అంకిత జంట..

Archary

Archary

మిక్స్‌డ్ డబుల్స్ ఆర్చరీ జోడీ ధీరజ్ బొమ్మదేవర, అంకిత భకత్ కాంస్య పతక పోరులో అమెరికాతో తలపడింది. ఈ క్రమంలో.. భారత జోడీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. భారత జోడీ తొలి రెండు షాట్‌లలో 17 పాయింట్లు సాధించింది. అదే సమయంలో అమెరికా జోడీ కౌఫ్‌హోల్డ్, అల్లిసన్ తొలి రెండు షాట్లలో 19 పరుగులు చేసి రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. నాలుగో సెట్‌లో భారత జోడీ మొత్తం 35 పరుగులు చేసింది. నాలుగో సెట్‌లో అమెరికా జోడీ 37 పాయింట్లు సాధించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. భారత్‌కు కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించే అవకాశం ఉండగా.. అయితే ధీరజ్, అంకిత జంట మ్యాచ్‌లో 2-6తో ఓడిపోయి పతకాన్ని కోల్పోయింది.

Shubhanshu Shukla: రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లబోతున్న రెండో భారతీయుడు ఇతనే..

తొలి సెట్‌లో తొలి రెండు షాట్లలో అమెరికా జోడీ 19 పరుగులు చేయగా, భారత్‌ జోడీ తొలి రెండు షాట్లలో 17 పరుగులు చేయడంతో అమెరికా రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. రెండో సెట్‌లో తొలి రెండు షాట్లలో భారత్ మొత్తం 17 పాయింట్లు సాధించగా, అమెరికా జోడీ 18 పాయింట్లు సాధించి ఒక పాయింట్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో సెట్‌లో భారత జోడీ మొత్తం 35 పరుగులు చేసింది. మరోవైపు అమెరికా 37 పరుగులతో 4-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో సెట్‌లో పునరాగమనం చేసేందుకు ప్రయత్నించిన భారత జోడీ తొలి రెండు షాట్లలో మొత్తం 19 పాయింట్లు సాధించింది. మరోవైపు అమెరికా జోడీ కౌఫ్‌హోల్డ్, ఎల్లిసన్ 17 పరుగులు చేయడంతో భారత్‌కు రెండు పాయింట్ల ఆధిక్యం లభించింది. మూడో సెట్‌లో ధీరజ్, అంకిత జోడీ మొత్తం 38 పరుగులు చేయగా, అమెరికా జోడీ 33 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Pooja Khedkar Mother: పూజా ఖేద్కర్ తల్లికి రిలీఫ్..! బెయిల్ మంజూరు

భారత మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆర్చరీ జోడీ అంకితా భకత్‌, ధీరజ్‌ బొమ్మదేవర.. అమెరికా జోడీ కాస్సీ, అల్లిసన్‌తో కాంస్య పతకాన్ని ప్రారంభించారు. ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు పతకాల మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి.

Exit mobile version