DGCA Emergency Advisory: విమానయాన సంస్థలకు DGCA అత్యవసర సలహా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGCA Emergency Advisory: దేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులకు అత్యవసర కార్యాచరణ సలహాను జారీ చేసింది. మస్కట్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ (FIR), పరిసర ప్రాంతాలలో అగ్నిపర్వత బూడిద కార్యకలాపాలు గుర్తించిన తర్వాత DGCA ఈ అత్యవసర సలహాను జారీ చేసింది. అగ్నిపర్వత బూడిద కార్యకలాపాలు అనేవి ఈ ప్రాంతంలో నడుస్తున్న విమానాలకు భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుందని హెచ్చరించింది.
READ ALSO: Gold Reserves: ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాలు ఇవే..
Also Read
ప్రమాదకరమైన అగ్నిపర్వత పరిస్థితుల గురించి పైలట్లను హెచ్చరించడానికి DGCA సోమవారం సాయంత్రం NOTAM లాంటి ప్రకటన అయిన ప్రత్యేక విమానయాన హెచ్చరిక ASHTAM జారీ చేసింది. దానితో పాటు, అగ్నిపర్వత బూడిద సలహా కూడా జారీ చేసింది. అన్ని భారతీయ విమానయాన ఆపరేటర్లను ఆపరేషన్స్ మాన్యువల్ – వోల్కనిక్ యాష్ గురించి సిబ్బందికి వివరించాలని ఈ ప్రకటనలో కోరింది. బూడిద ప్రభావిత ప్రాంతాలు, విమాన స్థాయిలను కచ్చితంగా నివారించాలని నియంత్రణ సంస్థ విమాన సిబ్బందికి – కాక్పిట్, క్యాబిన్, అలాగే డిస్పాచర్లకు సూచించింది. తాజా సలహాల ఆధారంగా విమాన ప్రణాళిక, రూటింగ్, ఇంధన అవసరాలకు అవసరమైన సర్దుబాట్లను చేసుకోవాలని కూడా కోరింది.
ఇంజిన్ పనితీరులో హెచ్చుతగ్గులు లేదా క్యాబిన్ పొగ/వాసనతో సహా అగ్నిపర్వత బూడిదతో ఏదైనా అనుమానం ఎదురైతే “వెంటనే” నివేదించాలని నియంత్రణ సంస్థ తెలిపింది. అగ్నిపర్వత బూడిద స్థాయి, NOTAMలు, వాతావరణ డేటాకు సంబంధించిన నవీకరణలను నిరంతరం పర్యవేక్షించాలని విమాన డిస్పాచ్ బృందాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒమన్ పై అగ్నిపర్వత బూడిద కార్యకలాపాల కోసం “అత్యవసర కార్యాచరణ సలహా” జారీ చేస్తూ, తాజా మార్గదర్శకత్వం ప్రకారం ప్రభావిత ఎత్తులు, ప్రాంతాలపై ప్రయాణాలను నివారించాలని DGCA విమానయాన సంస్థలకు తెలిపింది. “వర్తించే చోట డిస్పాచ్ విధానాలు, విమాన ప్రణాళిక, కార్యాచరణ మినిమాను సవరించండి. ప్రభావిత ప్రాంతాల సమీపంలో నడుస్తున్న ఏదైనా విమానానికి పోస్ట్-ఫ్లైట్ ఇంజిన్, ఎయిర్ఫ్రేమ్ తనిఖీలను నిర్వహించండి” అని అడ్వైజరీ పేర్కొంది. అలాగే “పరిస్థితులు క్షీణించినట్లయితే ప్రభావిత విమానాశ్రయాలకు కార్యకలాపాలను నిలిపివేయాలని లేదా ఆలస్యం చేయండి” అని సలహా ఇచ్చింది.
అలాగే “ఆపరేటర్లు తరచుగా విడుదల అవుతున్న యాష్ మూవ్మెంట్ అంచనాలతో సిద్ధంగా ఉండాలి. ఈ సమాచారాన్ని అన్ని సంబంధిత కార్యాచరణ విభాగాలకు అందజేయాలని, తదుపరి నోటీసు వచ్చే వరకు వీటిని పాటించాలని” ఈ ప్రకటనలో DGCA సూచించింది.
READ ALSO: Smriti Mandhana: ఫోటోలను తొలగించిన స్మృతి మంధాన.. సోషల్ మీడియాలో కొత్త కలకలం..
తాజావార్తలు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!