Delhi: వామ్మో.. ప్రియుడిని చంపి.. నెయ్యి, వైన్ పోసి తగులబెట్టిన ప్రియురాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Murder Case: దేశ రాజధాని ఢిల్లీ తిమార్పూర్లో అక్టోబర్ 6న జరిగిన యూపీఎస్సీ అభ్యర్థి దారుణ హత్యకు సంబంధించిన సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ హత్య వెనుక ఉన్న కుట్రను ఢిల్లీ పోలీసులు తాజాగా బయటపెట్టారు. ఈ కేసులో ప్రియురాలితో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆ ప్రియురాలు ప్రియుడి గొంతు కోసి చంపి, సాక్ష్యాలను నాశనం చేసినందుకు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు.
READ MORE: Supreetha: మోకాళ్లపై శ్రీవారి మెట్లెక్కిన ప్రముఖ నటి కూతురు
Also Read
- Sai Sudarshan: నువ్వేమైనా చిన్న పిల్లాడివా..? ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉండి ఏంటి ఆ ఆట..? సుదర్శన్పై విమర్శలు..
- DK Shivakumar: గవర్నర్ను కలిసిన డీకే.శివకుమార్.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..!
- Delhi attack plan: అణు కేంద్రాలు, ఎయిర్పోర్టులే టార్గెట్.. దావూద్-ఐఎస్ఐ కుట్ర భగ్నం..
- Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్పై రూ.22 తగ్గించిన పాక్..
అసలు ఏం జరిగింది..?
అక్టోబర్ 6న గాంధీ విహార్ లోని నాల్గవ అంతస్తు ఫ్లాట్ లో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేసరికి కాలిపోయిన మృతదేహం కనిపించింది. తరువాత మృతుడిని 32 ఏళ్ల రామ్ కేష్ మీనాగా గుర్తించారు. అయితే.. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కుట్రను బయటపెట్టింది. సంఘటన జరిగిన రోజున ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు భవనంలోకి ప్రవేశించినట్లు ఫుటేజ్లో కనిపించింది. వారిలో ఒకరు దాదాపు 39 నిమిషాల తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత.. తెల్లవారుజామున 2:57 గంటలకు ఒక మహిళ, మరో వ్యక్తితో కలిసి ప్లాట్ నుంచి బయటకు వచ్చింది. వెంటనే అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన పోలీసుల అనుమానాన్ని రేకెత్తించింది.
READ MORE: Cyclone Montha: దూసుకొస్తున్న మొంథా తుఫాన్.. ఏపీ, యానాం తీరాలకు రెడ్ అలర్ట్ జారీ
ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రామ్ కేష్ ప్రియురాలు అమృత చౌహాన్(21) ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. అమృత చౌహాన్, ఆమె మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్( 27), అతని స్నేహితుడు 29 ఏళ్ల సందీప్ కుమార్ కలిసి రామ్ కేష్ మీనాను హత్య చేశారు. అనంతరం మృతదేహంపై నూనె, నెయ్యి, మద్యం పోసి ఎల్పీజీ సిలిండర్ రెగ్యులేటర్ తెరిచి పేల్చేశారు. దీన్ని అగ్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఈ ముగ్గురూ ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నివాసితులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అక్కడ పోలీసులు వారిని అరెస్టు చేశారు. రామ్ కేష్ మీనా వద్ద తనకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ఉందని అమృత తెలిపింది. వాటిని డిలీట్ చేయడానికి తన ప్రియుడు అంగీకరించలేదని అందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
Romantic Comedy Movie OTT : మసాజ్ సెంటర్ లో మత్తెక్కించే దృశ్యాలు… ఓటీటీలోకి మలయాళ బోల్డ్ రొమాంటిక్ మూవీ
-
KTM India: జూన్ 1 నుంచి KTM బైక్స్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్.. ఏయే మోడళ్లపై ఎఫెక్ట్ అంటే?
-
Sai Sudarshan: నువ్వేమైనా చిన్న పిల్లాడివా..? ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉండి ఏంటి ఆ ఆట..? సుదర్శన్పై విమర్శలు..
-
Nagendra Kasi: ‘రాకా’ నుంచి మైండ్ బ్లాక్ అప్డేట్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ల్యాండ్మార్క్ అంటూ కామెంట్స్!
-
DK Shivakumar: గవర్నర్ను కలిసిన డీకే.శివకుమార్.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..