NTV Telugu Site icon

IPL 2022: ఇద్దరు విదేశీ ఆటగాళ్లనే తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. నిబంధనల ప్రకారం ప్రతి టీమ్ నలుగురు విదేశీ ఆటగాళ్లను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంటుంది. కానీ రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్, వెస్టిండీస్ ఆటగాడు ఆర్.పావెల్‌కు మాత్రమే జట్టులో అవకాశం కల్పించింది. గతంలో 2011లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. అప్పుడు కలిస్, మోర్గాన్‌లను మాత్రమే చెన్నై జట్టులోకి తీసుకుంది. కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతోనే ఓ జట్టు ఆడటం ఇది ఐపీఎల్‌లో రెండో సారి మాత్రమే.

కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషబ్ పంత్ సారథ్యం వహిస్తుండగా.. ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్, ఇషాన్ కిషాన్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, అన్మోల్‌ప్రీత్, టిమ్ డేవిడ్, డానియెల్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, బుమ్రా, థంపి.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, సీఫెర్ట్, మన్‌దీప్ సింగ్, పంత్, ఆర్.పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్,శార్దూల్ ఠాకూక్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్, కె.నాగర్‌కోటి.